ఘట్కేసర్ టౌన్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చలవతోనే తెలంగాణ వచ్చిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ఇంటి పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సర్వేలపేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు ఎత్తివేయాలని ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు.
పార్టీల అభివృద్ధి కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదును భారీ ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం్య మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్షా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లోని సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామని హామీలిచ్చి 170 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేశారని, 2000లకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు.
అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేముల మహేష్గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, బాల్రెడ్డి, జిల్లా కార్యదర్శి కొంతం రాంరెడ్డి, బీసీ సెల్ కార్యదర్శి వేముల సత్తయ్యగౌడ్, పీసీసీ కార్యదర్శి మందాడి సురేందర్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గ్యారలక్ష్మాయ్య, సర్పంచ్లు అబ్బసాని యాదగిరియాదవ్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సభలో రసాభాస..
మండల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. మాజీ జెడ్పీటీసీ రాంరెడ్డి, పీసీసీ కార్యదర్శి జనార్దన్రెడ్డి సభలో తమకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే పార్టీ కోసం పనిచేసేవారికి అవకాశం ఇస్తామని, పార్టీ బలపరిచిన అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేసిన వారికి సభలో మాట్లడటానికి అవకాశం లేదని కేఎల్లార్ చెప్పారు. దీంతో సభలో గందళరగోళం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కల్పించుకొని వారిరువురికి సభ్యత్వం ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.
సోనియా చలవతోనే తెలంగాణ
Published Mon, Nov 17 2014 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement