రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి | Six killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి

May 5 2014 3:41 AM | Updated on Aug 30 2018 3:58 PM

రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణవాసులు ఐదుగురు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని సేడెంలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

  •      గుల్బర్గా జిల్లా సేడెం సమీపంలో రెండు కార్లు ఢీ
  •      రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన ఐదుగురి దుర్మరణం
  •      కర్ణాటకకు చెందిన మరో వ్యక్తి కూడా...
  •      పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన
  •  వికారాబాద్, న్యూస్‌లైన్: రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణవాసులు ఐదుగురు దుర్మరణం చెందారు. కర్ణాటకలోని సేడెంలో ఆదివారం రాత్రి 7:30 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.

    వివరాలు.. పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన మహ్మద్‌ఖాన్(62) టీబీ ఆస్పత్రి రిటైర్డ్ ఉద్యోగి. ఆయన  ఆదివారం తతన భార్య ఆశాబేగం(52), కుమారుడు ఫజల్‌ఖాన్(24), మనవడు రేహాన్(5), సమీప బంధువు(50)తో కలిసి ఇండికా కారులో కర్ణాటక గుల్బర్గా జిల్లా కర్తాల్‌లో బంధువుల వివాహానికి వెళ్లాడు.

    రాత్రి తిరుగు ప్రయాణంలో సేడెం సమీపంలోని కండ్రపల్లి సమీపంలో వీరి కారును ఎదురుగా వస్తున్న స్కార్పియో ఢీకొంది. ప్రమాదంలో వీరంతా తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే దుర్మరణం చెందారు. కాగా ఈ ప్రమాదంలో  కర్నాటకలోని చిత్తాపూర్‌కు చెందిన ఇన్నోవా కారు డ్రైవర్ అయ్యన్న పూజారి(25)కూడా మృతిచెందారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement