
కన్నీరు మున్నీరైన సిద్ధయ్య భార్య ధరణి
నల్గొండ జిల్లా జానకిపురంలో జరిగిన ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య అంతిమ యాత్ర ప్రారంభమైంది.
జడ్చర్ల : నల్గొండ జిల్లా జానకిపురంలో జరిగిన ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఆత్మకూరు (ఎం) ఎస్ఐ సిద్ధయ్య అంతిమ యాత్ర ప్రారంభమైంది. భర్త మృతదేహాన్ని చూసి సిద్ధయ్య సతీమణి ధరణి కన్నీరు మున్నీరయ్యారు. కామినేని ఆస్పత్రి నుంచి బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయిన ఆమె భర్త అంత్యక్రియలకు జడ్చర్ల వచ్చారు. భర్త మృతదేహాన్ని చూసి ధరణి భోరున విలపించారు. ఆమె నాలుగు రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు సిద్ధయ్యను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. అలాగే అధికారులు, రాజకీయ నేతలు సిద్ధయ్య భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మరోవైపు తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ.. సిద్ధయ్య అంత్యక్రియల్లో పాల్గొననున్నట్లు సమాచారం.