రాత్రికి రాత్రే కరెంట్ తేలేం | minister jagadish reddy fire on opposition parties | Sakshi
Sakshi News home page

రాత్రికి రాత్రే కరెంట్ తేలేం

Oct 10 2014 12:13 AM | Updated on Sep 2 2017 2:35 PM

అరవై ఏళ్ల ఆంధ్రా పాలకుల అసమర్ధపాలనే నేడు తెలంగాణలో కరెంట్ సమస్యకు కారణమని విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు.

మంత్రి జగదీష్‌రెడ్డి

కోదాడ: అరవై ఏళ్ల ఆంధ్రా పాలకుల అసమర్ధపాలనే నేడు తెలంగాణలో కరెంట్ సమస్యకు కారణమని విద్యాశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కోదాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ వస్తువు లాగా రాత్రికి రాత్రే కరెంట్‌ను కొనుక్కురాలేమని చెప్పారు. 

ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ తీసుకురాకుం డా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కరెంటులైన్ ఏర్పాటుకు అడ్డుపుల్ల వేశాడన్నారు.  మహారాష్ట్ర నుంచి యూనిట్‌కు రూ.8 నుంచి 10 వరకు ఖర్చు చేసైనా కోనుగోలు చేసి వ్యవసాయానికి అందిస్తు న్నామని చెప్పారు. పంటలెండిపోకుండా  చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement