చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి | manchala ASi killed due to road accident | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి

Mar 29 2016 11:26 AM | Updated on Aug 30 2018 4:07 PM

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న జి.సుదర్శన్‌రెడ్డి(50) మంగళవారం ఉదయం మృతి చెందారు.

మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న జి.సుదర్శన్‌రెడ్డి(50) మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈనెల 19వ తేదీన  సుదర్శన్ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్రంగా గాయాలు కావటంతో ఆయన అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున చనిపోయారు. ఆయన స్వస్థలం రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి. సుదర్శన్‌రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీసు అధికారుల సంఘం రూ.35,000 సాయంగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement