కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల్లో రసాభాస | Komatireddy brothers supporters slogans against Uttam kumar reddy | Sakshi
Sakshi News home page

కార్యకర్తల మధ్యే కూర్చున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌

Sep 9 2017 3:12 PM | Updated on Sep 19 2019 8:44 PM

కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల్లో రసాభాస - Sakshi

కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల్లో రసాభాస

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణా తరగతులు రసాభాసగా మారాయి.

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్ పార్టీ  కార్యకర్తల శిక్షణా తరగతులు రసాభాసగా మారాయి. శంషాబాద్‌లో జరుగుతున్న పార్టీ శిక్షణా తరగతులకు శనివారం నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి హాజరయ్యారు. అయితే నేతలు మాత్రం.. కోమటిరెడ్డి సోదరులను వేదికపైకి ఆహ్వానించలేదు. దీంతో కార్యకర్తల మధ్యే వారిద్దరూ సుమారు రెండు గంటలపాటు కూర్చొని వెళ్లిపోయారు. కోమటిరెడ్డి సోదరులు వెళ్లిపోయే సమయంలో ఉత్తమ్‌ హఠావో...కాంగ్రెస్‌ బచావో అంటూ వారి అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement