నా పనితీరు బాగోలేదని ఎవరూ అన్లేదు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో తన పనితీరు బాగోలేదని ఎవరూ చెప్పలేదని సీఎల్పీ నేత కె.జానారెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘సీఎల్పీ పనితీరు బాగాలేదని, మారుస్తారని మీడియాలో రాసే రాతలకు భయపడను, బాధపడబోను. పెద్ద మనిషి తరహాలో నేను సీఎల్పీ నేతగా వ్యవహరిస్తున్నా. ఇప్పటి పోటీ రాజకీయాలకు నేను సరిపోననే అభిప్రాయం కొందరికి ఉంటే ఉండొచ్చు. రాజకీయాల్లో ఎలా పనిచేయాలనే దానిపై నాకో స్టైల్ ఉంది.
పార్టీ వ్యూహాలు, ఎత్తుగడలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. వాటిని ఎమ్మెల్యేలైనా, ఇంకెవరైనా ముందుగానే లీక్ చేయడం సరికాదు. నా పని తీరు బాగాలేదని ఎవరూ నాతో చెప్పలేదు’ అని పేర్కొన్నారు. సీఎల్పీ పదవిపై ఎవరికైనా ఆసక్తి ఉంటే చెప్పాలని తమ ఎమ్మెల్యేలకు ముందుగానే సూచించానన్నారు.
రాజకీయాల్లో నా స్టైల్ నాకుంది
Published Thu, Dec 29 2016 12:56 AM
# Tag
Related news
-
జానారెడ్డితో ఇంద్రకరణ్రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అల్లోల ఇంద్రకరణ్రెడ్డి త్వరలోనే కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురువారం ఆయన హైదరా బాద్లో సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డితో భేటీ అయిన నేపథ్యంలో ఈ ప్రచారం ఊపందుకుంది. ఇంద్రకరణ్రెడ్డి చేరికపై గతంలోనూ ప్రచారం జరిగినా, గురువారం జానా నివాసానికి వెళ్లి గంటకుపైగా చర్చలు జరపడంతో కచ్చితంగా పార్టీ మారతారని భావిస్తున్నారు. -
ఐఏఎన్ఎస్లో అదానీకి మెజార్టీ వాటాలు
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ .. మీడియా రంగంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ఇండియాలో 50.5 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ లావాదేవీ నిర్వహించింది. ఐఏఎన్ఎస్, అందులో వాటాదారు (ఎండీ, ఎడిటర్–ఇన్–చీఫ్) సందీప్ బమ్జాయ్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది. అయితే, కొనుగోలు కోసం ఎంత వెచి్చంచినదీ మాత్రం వెల్లడించలేదు. ‘ఐఏఎన్ఎస్ నిర్వహణ నియంత్రణ అంతా ఏఎంఎన్ఎల్ చేతిలో ఉంటాయి. సంస్థలో డైరెక్టర్లను ఎంపిక చేసే అధికారాలు కూడా ఉంటాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. కొనుగోలు అనంతరం ఐఏఎన్ఎస్ ఇకపై ఏఎంఎన్ఎల్కు అనుబంధ సంస్థగా వ్యవహరిస్తుందని వివరించింది. మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను అనారోగ్యం బారిన పడినప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితులు మారాయని బమ్జాయ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్నకు వాటాలు విక్రయించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు భద్రత కలి్పంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మెజారిటీ వాటాలు విక్రయించేసినందున ఇకపై సంస్థ రోజువారీ నిర్వహణలో పాల్గొనబోనని పేర్కొన్నారు. ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ ఖాతాలో మొత్తం మూడు మీడియా సంస్థలు (ఎన్డీటీవీ, క్వింటిలియన్, ఐఏఎన్ఎస్) చేరినట్లయింది. ఐఏఎన్ఎస్ కథ ఇదీ.. ఐఏఎన్ఎస్ అనేది ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయుల అవసరాల కోసం 1986లో ఇండో–ఏíÙయన్ న్యూస్ సర్వీస్గా ప్రారంభమైంది. అటు తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా భారత్, దక్షిణాసియాపై ప్రధానంగా దృష్టి పెడుతూ పూర్తి స్థాయి వైర్ ఏజెన్సీగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 12 కోట్లు, అంతకు ముందు రూ. 9 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సంస్థలో 200 మంది పైచిలుకు ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా (ఉత్తర అమెరికా, యూరప్ మొదలైన ప్రాంతాల్లో) 350కి పైగా సబ్స్క్రయిబర్స్ ఉన్నారు. బీక్యూ ప్రైమ్ అనే ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్ఫాంను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ గతేడాది మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్డీటీవీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. -
రేవంత్ రెడ్డిని CLP లీడర్ గా ఎన్నుకున్నట్లు తెలిపిన నేతలు
రేవంత్ రెడ్డిని CLP లీడర్ గా ఎన్నుకున్నట్లు తెలిపిన నేతలు -
ప్రమాణ స్వీకారం రోజునే 6 గ్యారంటీలపై సంతకాలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డిని ఎంపిక చేశామని, ఈ నెల 7న ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని ‘ఆరు గ్యారంటీ’ల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రకటించిన విధంగా ప్రమాణ స్వీకారోత్సవం రోజునే ఆరు గ్యారెంటీలపై సంతకాలు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా మహిళలు, రైతులు, విద్యార్థులు, ఇళ్లు లేని పేద కుటుంబాలు, నిస్సహాయుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఈ హామీలను ప్రకటించడంతో ఆయా వర్గాల్లో భారీగా ఆశలు రేకెత్తాయి. కాగా ఈ హామీల అమలుకు ఏటా కనీసం రూ.88 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని ఓ అంచనా. అయితే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తే మాత్రం నిధుల అవసరాలు రూ.లక్ష కోట్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీటి అమలుకు మరిన్ని రూ.వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఎన్నికల హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుకు అవసరం కానున్న నిధులపై ‘సాక్షి’విశ్లేషణాత్మక కథనం.. మహాలక్ష్మికి రూ.10 వేల కోట్లు! మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 చొప్పున ఆర్థిక సహాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షలకు పైగా నిస్సహాయ పేద మహిళలకు కొత్తగా నెలకు రూ.2500 చొప్పున సహాయం అందించాల్సి ఉండనుందని అంచనా. ఈ లెక్కన ఏటా రూ.6 వేల కోట్ల వ్యయం కానుంది. ♦ ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను రూ.955కు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 1.28 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లుండగా, రోజుకు 1.8 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లను విక్రయిస్తున్నారు. ఈ లెక్కన రూ.500కే గ్యాస్ సిలిండర్ను అందించడానికి ఏటా కనీసం రూ.2,923.65 కోట్ల గ్యాస్ సబ్సి డీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. గ్యాస్ ధర పెరిగిన కొద్దీ ఈ భారం పెరుగుతుంది. ♦ మహిళలకు ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడానికి సుమారుగా రూ.2,200 కోట్ల వ్యయం కానుంది. కేవలం పల్లె వెలుగు బస్సుల్లో ఈ సదుపాయం కల్పిస్తే రూ.750 కోట్లు కానున్నాయి. రైతు భరోసాకు రూ.29 వేల కోట్లు! రైతు భరోసా పథకం కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 చొప్పున, వ్యవసాయ కూలీలకు రూ.12,000 చొప్పున ఆర్థిక సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతు కూలీలున్నట్టు అంచనా. వీరికి రూ.12 వేలు చొప్పున ఇవ్వడానికి ఏటా రూ.3 వేల కోట్లు అవసరం కానున్నాయి. అలాగే ఎకరానికి రూ.15 వేలు చొప్పున రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకు ఇచ్చేందుకు ఏటా రూ.22,500 కోట్లు, 6 లక్షల మంది కౌలు రైతులకు ఏటా రూ.3,000 కోట్ల సాయం అందించాల్సి ఉంటుంది. ఏటా సుమారు కోటిన్నర టన్నుల ధాన్యం సేకరిస్తుండగా, టన్నుకు రూ.500 చొప్పున రూ.750 కోట్లను ఇవ్వాల్సి ఉండనుంది. ఈ లెక్కన మొత్తం రైతు భరోసాకు ఏటా సుమారు రూ.29 వేల కోట్లు అవసరం అని అంచనా. ఇందిరమ్మ ఇళ్లకు రూ.15 వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థిక సహాయం, ఉద్యమకారు లకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దశల వారీగా ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. ఏటా ఎన్ని కుటుంబాలకు వర్తింపజేస్తారన్న అంశంపై స్పష్టత వచ్చాకే అందుకు అవసరం కానున్న నిధులపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఇళ్లు లేని కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇళ్లులేని పేద కుటుంబాలు దాదాపుగా ఇదే సంఖ్యలో ఉంటాయని అంచనా వేయవచ్చు. ఐదేళ్ల టర్మ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 15 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని నిర్ణయిస్తే, ఏటా కనీసం 3 లక్షల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఏటా రూ.15 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా. యువ వికాసానికి రూ.10 వేల కోట్లు? విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు విషయంలో.. ఏ స్థాయి విద్య కోసం ఎంత మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు అనే అంశంపై స్పష్టత వస్తేనే ఈ పథకం అమలుకు అవసరం కానున్న నిధులను అంచనా వేయడానికి వీలుంది. ఏటా 2 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తే రూ.10 వేల కోట్ల నిధులు అవసరం కానున్నాయి. గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు.. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరాకు ఏటా రూ.3,431.03 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సి ఉంటుందని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకు అందిస్తున్న సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలను కొనసాగిస్తూ అదనంగా ఈ మేరకు నిధులివ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం గృహ కేటగిరీ విద్యుత్ కనెక్షన్లు 1.20 కోట్లు కాగా, అందులో 1.05 కోట్ల కనెక్షన్లు (87.9 శాతం గృహాలు) నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ను మాత్రమే వినియోగిస్తున్నాయి. చేయూతకు రూ. 21 వేల కోట్లు చేయూత పథకం కింద నెలకు రూ.4వేల పెన్షన్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలు చేస్తామ ని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద మొత్తం 43,68,784 మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, కల్లు గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్నారు. వీరికి రూ.4 వేల పెన్షన్ చెల్లిస్తే ఏటా సుమారు రూ.20,970 కోట్లు అవసరం అవుతాయి. రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అమలుకు అదనంగా నిధులు అవసరం కానున్నాయి. -
సామాజిక కోణంలో కేబినెట్ కూర్పు
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వేదికగా మంగళవారం జరిగిన ఈ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. కొత్త సీఎల్పీ నాయకుడిగా ఎంపికైన రేవంత్రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, హైకమాండ్ పెద్దలు కేసీ వేణుగోపాల్, డి.కె.శివకుమార్, మాణిక్రావ్ ఠాక్రేల సమక్షంలో చర్చించిన తర్వాత రాహుల్, ఖర్గేలతో మాట్లాడి వారి అనుమతి మేరకు కీలక పదవులపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా కేబినెట్లో ఎంతమందిని తీసుకోవాలి? ఎవరెవరిని తీసుకోవాలి? ఏయే సామాజిక వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యమివ్వాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుని గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులందరి చేత ప్రమాణం చేయించనున్నారు. డిప్యూటీ సీఎంలు ఒకరా... ఇద్దరా? రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్రెడ్డిని సీఎంగా నిర్ణయించిన నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఒకరిని నియమించాలా లేదా ఇద్దరికి అవకాశమివ్వాలా అన్న దానిపై టీపీసీసీ ముఖ్యులతో సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతమున్న సమాచారం మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేరు ఇప్పటికే ఖరారైనట్టు తెలుస్తోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టి గతంలో పలు పదవులు నిర్వహించారు. ప్రస్తుతం సీఎల్పీ నేతగా ఉన్న ఆయనకు తగిన గౌరవం ఇవ్వాల్సిన దృష్ట్యా కేబినెట్లో కీలక శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాను భట్టికి మాత్రమే పరిమితం చేస్తారని, అలాగే భట్టితో పాటు మరొకరికి కూడా ఇస్తారనే రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై బుధవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది? కొత్త మంత్రివర్గాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానిపై అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏ సామాజిక వర్గం నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారనే అంశంతో పాటు ఏ సామాజిక వర్గానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న కోణంలో కసరత్తు చేస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 25 మంది ఎంపిక కాగా.. సీఎంతో పాటు నాలుగు లేదా ఐదు బెర్తులు వారికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ), పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (ఖమ్మం), సుదర్శన్రెడ్డి (నిజామాబాద్)లకు మంత్రివర్గంలో స్థానం ఖరారైనట్టేనని తెలుస్తోంది. టి.రామ్మోహన్రెడ్డి (రంగారెడ్డి), దొంతి మాధవరెడ్డి (వరంగల్)ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకటి లేదా రెండు విప్ పదవులు కూడా ఈ సామాజిక వర్గానికి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విప్లుగా ఉన్నత విద్యావంతులైన మహిళలు పరణికారెడ్డి, యశస్వినిరెడ్డిల్లో ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. వీరితో పాటు మల్రెడ్డి రంగారెడ్డి (రంగారెడ్డి), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (నల్లగొండ)లకు కూడా ప్రభుత్వంలో ప్రాధాన్య పదవులు లభించే అవకాశాలున్నాయి. ఇక వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్రావు, జూపల్లి కృష్ణారావులలో ఒకరికి లేదంటే ఇద్దరికీ మంత్రిగా అవకాశం దక్కనుంది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు మరోమారు కేబినెట్ మంత్రి బాధ్యత అప్పగించడం ఖాయమేనని, ఆయనకు విద్య లేదా ఐటీ శాఖ అప్పగించవచ్చనే చర్చ జరుగుతోంది. బీసీలలో వీరికే.. తాజా ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వీరిలో పొన్నం ప్రభాకర్ (హుస్నాబాద్)కు కేబినెట్ బెర్తు ఖరారయిందనే చర్చ జరుగుతోంది. ఈయనతో పాటు మహిళా కోటాలో కొండా సురేఖ (వరంగల్ ఈస్ట్) పేరు ప్రకటన కూడా లాంఛనప్రాయమేనని తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు మరొకరికి అవకాశం ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఆది శ్రీనివాస్ (మున్నూరు కాపు), వాకిటి శ్రీహరి (ముదిరాజ్), బీర్ల అయిలయ్య (యాదవ్)లలో ఒకరికి చాన్స్ దొరకొచ్చని అంటున్నారు. ఎస్సీ కోటాలో రాజనర్సింహ ఖరారు దళిత ఎమ్మెల్యేలకు కూడా కొత్త కేబినెట్లో తగిన ప్రాధాన్యం ఇచ్చేలా అధిష్టానం కసరత్తు సాగుతోంది. మాల సామాజిక వర్గానికి చెందిన భట్టిని ఉప ముఖ్యమంత్రిగా నియమించనున్న నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన దామోదర రాజనర్సింహ (ఆంథోల్)కు కీలక శాఖ అప్పగించవచ్చని తెలుస్తోంది. ఆయనతో మాదిగ వర్గానికే చెందిన మరొక నాయకుడికి కూడా అవకాశాలున్నాయని అంటున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన ఓయూ విద్యార్థి నాయకుడు మేడిపల్లి సత్యంకు విప్ పదవి వస్తుందని, ఆయనతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశం (నకిరేకల్)కు కూడా విప్ హోదా కల్పించే ప్రతిపాదనలున్నాయని సమాచారం. ఇక ఎస్టీ కోటాలో ధనసరి అనసూయ (సీతక్క)కు మంత్రి పదవి ఖాయమైనట్టే. ఆమెకు డిప్యూటీ సీఎం హోదా ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆదివాసీ వర్గాలకు చెందిన ఆమెతో పాటు లంబాడా సామాజిక వర్గం నుంచి ఎన్.బాలూనాయక్ (దేవరకొండ), రామచంద్రనాయక్ (డోర్నకల్)ల పేర్లు వినిపిస్తున్నాయి. ఖాళీగా కొన్ని బెర్తులు? పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారిలో ముఖ్యమంత్రిని, మంత్రులుగా మరో 17 మందిని నియమించే అవకాశం ఉండడంతో ఆ మేరకు ఒకేసారి భర్తీ చేస్తారా.. రెండు నుంచి నాలుగు బెర్తులను ఖాళీగా ఉంచి తొలిసారి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పూర్తి చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ప్రాంతాల వారీ ప్రాధాన్యతల దృష్ట్యా హైదరాబాద్ లాంటి జిల్లాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలంటే ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాల్సి ఉన్న నేపథ్యంలో అని బెర్తులనూ నింపకపోవచ్చని తెలుస్తోంది. ఇలా మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న అనేకమంది.. ఏఐసీసీ పెద్దలు, తమకు సన్నిహితులై ఇతర రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో లాబీయింగ్ చేస్తుండటం గమనార్హం.
Related News by category
-
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్షోలో పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్ను జైలుకు పంపించారన్నారు. తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. సునీతా కేజ్రీవాల్కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్షోలు ప్రారంభించారు. తొలి రోడ్షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
అలా చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు?.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మలివిడత ఎన్నికల ప్రచార భేరి మోగించారు.ఇక సిద్ధం సభలు గ్రాండ్ సక్సెస్ కావడం.. బస్సు యాత్ర చరిత్ర సృష్టించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, సానుభూతిపరులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్, నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో ఆదివారం జరిగిన సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మరోవైపు, ఎక్స్ (ట్విటర్) వేదికగా చంద్రబాబు మోసాలను సీఎం జగన్ ఎండగట్టారు.‘‘అయ్యా చంద్రబాబూ.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు...? వచ్చే ఎన్నికల్లో మన వైసీపి అభ్యర్థులను ఆశీర్వదించి, ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాను’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. అయ్యా చంద్రబాబు.. 2014-19 మధ్య నీ పాలనలో జన్మభూమి కమిటీలను పెట్టావు. 2019లో మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చాం. మరి నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల మీద నమ్మకం, విశ్వాసం ఉంటే మళ్లీ అధికారంలోకి రాగానే జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పే ధైర్యం నీకుందా… pic.twitter.com/lSAAuOO7zw— YS Jagan Mohan Reddy (@ysjagan) April 28, 2024 -
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
మరోసారి కేజ్రీవాల్ను కలవనున్న పంజాబ్ సీఎం
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను ఇప్పటికే ఓ సారి కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' మళ్ళీ కలవనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఏప్రిల్ 30న తీహార్ జైలులో కలవనున్నట్లు సమాచారం.గతంలో ఓ సారి కేజ్రీవాల్ను కలిసిన తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ గతంలో తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. -
బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో ఎన్నికల సంఘం (ఈసీ).. ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిచ్చింది. ఆప్ ప్రచారగీతమైన 'జైల్ కే జవాబ్ మే హమ్ వోట్ దేంగే'పైన నిషేధం విధించింది.ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియంతృత్వ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఈ రోజు జరిగింది ఇదే.. బీజేపీ మరో ఆయుధంగా ఎన్నికల సంఘం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచార గీతాన్ని నిషేధించిందని పేర్కొన్నారు.బీజేపీ ప్రతి రోజూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించినప్పటికీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఊపిరి పీల్చుకున్న నోటీసులు వస్తాయని అతిషి అన్నారు. దీనికి సంబంధించి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక ట్వీట్ కూడా చేశారు.ర్యాప్ స్టైల్లో ప్రదర్శించిన 'జైల్ కా జవాబ్ వోటే సే' అనే ప్రచార గీతాన్ని గురువారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పాటను ఆప్ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ చీఫ్ విప్ దిలీప్ పాండే రచించి స్వరపరిచారు. దీన్ని కూడా ఇప్పుడు నిషేధించారని అతిషి అన్నారు.#WATCH दिल्ली: AAP नेता और दिल्ली सरकार में मंत्री आतिशी ने कहा, "... तानाशाही सरकारों में विपक्षी पार्टियों को प्रचार करने से रोका जाता है। आज यही हुआ है, भाजपा के एक और हथियार, चुनाव आयोग ने इस पत्र के माध्यम से आम आदमी पार्टी के कैंपेन सॉन्ग पर रोक लगा दी है... चुनाव आयोग को… pic.twitter.com/FzBY3ZblZg— ANI_HindiNews (@AHindinews) April 28, 2024
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement