కొత్త వాటికి లభించని అనుమతి
వరంగల్ క్రైం : ఈ సారి కొత్త బార్ షాపులకు అనుమతి లభించలేదు. దీంతో ఇప్పటివరకు నడుస్తున్న దుకాణాలకే రెన్యూవల్ చేయనున్నారు. సోమవారం ఆ ప్రక్రియను చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 90 బార్ షాపులు ఉండగా, రెన్యూవల్ ద్వారా రూ.34కోట్ల 16లక్షల ఆదాయం సమకూరునుంది. ఇప్పటికే వైన్ షాపుల టెండర్ల ప్రక్రియ ముగియగా, బార్ షాపులతో కలుపుకుని జిల్లాలో మొత్తంగా మద్యం విక్రయ కేంద్రాలు 322కు చేరుకున్నాయి. వాస్తవానికి 234 వైన్ షాపులకు దరఖాస్తులు కోరగా, 227 కే టెండర్లు వచ్చాయి. వీటిలో 25 షాపులకు ఒక్కో దరఖాస్తే వచ్చింది. 202 షాపులకు పోటీ ఉండగా, వాటిని లాటరీ ద్వారా కేటాయించారు.
టెండర్లు పడని ఏడు దుకాణాల్లో రెండింటిని మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించగా, ఐదు షాపులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగా, 2014-15 సంవత్సరానికిగాను బార్ షాపుల రెన్యూవల్స్ సోమవారం నుంచి చేపట్టనున్నారు. వాస్తవానికి దీనికి తుది గడువు లేనప్పటికీ జూలై ఒకటో తేదీలోపే బార్ షాపుల యజమానులు రెన్యూవల్ చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. రెన్యూవల్ సమయంలో లెసైన్స్ ఫీజులో 1/3 వంతుగానీ, సగం గానీ చెల్లించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ముకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలోని 90 బార్లలో కార్పొరేషన్ (వరంగల్, హన్మకొండ, కాజీపేట) పరిధిలోనే 88 షాపులు ఉన్నాయి.
మిగతా రెండు జనగామలో ఉండడం గమనార్హం. అక్కడి జనాభా ప్రాతిపదికన ఒక్కో బార్కు రూ.35 లక్షలు లెసైన్స్ ఫీజుగా నిర్ధారించారు. మహబూబాబాద్ పరిధిలో బార్లు లేవు. అయితే ఇప్పటికే జనాభాకు మించి బార్లు ఉండడంతో కొత్త వాటికి అనుమతి లేనట్లు సమాచారం. అయితే, ఈదఫా కొత్త పాలసీలో ఆరు రెట్ల ప్రివిలేజిని ఐదు రెట్లకు కుదించారు. దీంతో వ్యాపారుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇప్పటివరకు రూ.2 కోట్ల 28 లక్షల విలువ చేసే సరుకు అమ్మితే 18శాతం నుంచి 20 శాతం మేర లాభం ఉండేది. తాజా నిర్ణయంతో రూ.1కోటి 90 లక్షల మద్యం మాత్రమే అమ్మడానికి వీలుంటుంది. అంతకు మించితే 14.5 శాతం మేర ఫీజును అదనంగా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.
కొరవడిన నిఘా.. ధరల్లో దగా..
లెసైన్స్.. దాని ఫీజు ఎలా ఉన్నా.. బార్ షాపుల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తమకు ఉన్న కొంత వెసులుబాటును ఆసరాగా చేసుకుని ధరలను ఇష్టారీతిగా పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, బార్లలో ధరలపై తాము చేసేదేమీ ఉండదని ఎక్సైజ్అధికారులు చెబుతున్నారు. తమకు ధరలను నియంత్రించే అధికారం లేదని ఎక్సైజ్ శాఖ తేల్చివేయడంతో బార్ షాపుల యజమానులు విచ్చలవిడిగా ధరలు వసూలు చేస్తున్నారు. ఇక నకలీ మద్యం కూడా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నేటినుంచి బార్ షాపుల రెన్యూవల్
Published Mon, Jun 30 2014 3:56 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement