హైదరాబాద్‌ మెట్రోలో ఎంతమంది ప్రయాణించారో తెలుసా?

Hyderabad Metro Rail   Reached 20 million riders - Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక  హైదరాబాద్‌ మెట్రో రైలు ఎంతమందిని  చేరవేసిందో తెలుసా? జంట నగర వాసుల ఆదరణతో ఇప్పటివరకు 20 మిలియన్ల  (రెండు కోట్ల మంది)  ప్రయాణికులను గమ్య స్థానాలకు  చేర్చింది. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రో రైలు యాజమాన్యం ట్విటర్‌లో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రయాణికులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను షేర్‌ చేసింది. 

2017, నవంబర్‌ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులు మీదుగా మెట్రో రైలు  ప్రారంభమైంది. ప్రధాని స్వయంగా ఇందులో ప్రయాణించారు. నాగోల్-మియాపూర్ మధ్య మెట్రో తన పరుగును ఆరంభించింది. మెట్రో రైలుపై నగర వాసుల భారీ ఆసక్తితో ఆరంభంలోనే  భారీ ఆదరణను దక్కించుకుంది. కిక్కిరిసిన జనంతో మెట్రో రైలు పెద్ద విశేషంగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఎల్బీనగర్‌-అమీర్‌పేట మార్గంలో మెట్రో రైలు సేవలు ఈ నెలాఖరుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top