రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి | father and son dead due to night current | Sakshi
Sakshi News home page

రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి

Dec 17 2014 4:49 AM | Updated on Oct 17 2018 5:37 PM

రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి - Sakshi

రాత్రి కరెంట్‌కు తండ్రీకొడుకులు బలి

రాత్రి కరెంట్‌కు తండ్రీ కొడుకులు బలయ్యారు.

మెదక్: రాత్రి కరెంట్‌కు తండ్రీ కొడుకులు బలయ్యారు. ఈ సంఘటన మెదక్ మండలం కొచ్చెర్వు తండాలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన మూడావత్ జగ్న (66), పేమ్ని దంపతుల చిన్న కుమారుడు చిన్నా (25) పొలం వద్దకు వెళ్లారు. చెరకును కొంత మేర నాటారు. ఆ తరువాత ఏమైందో ఏమో కాని ఇరువురూ స్టార్టర్ వద్ద విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. మంగళవారం ఉదయం ఎంతసేపైనా తండ్రి, సోదరుడు ఇంటికి రాకపోవడంతో మరో కుమారుడు తిన్యా పొలం వద్దకు వెళ్లాడు. అయితే అప్పటికే తండ్రి, సోదరుడు విగత జీవులుగా పడి ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement