ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మృతి | farmer died in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యకు పాల్పడిన యువరైతు మృతి

Nov 20 2015 2:21 PM | Updated on Oct 2 2018 5:51 PM

నల్లగొండ జిల్లాలో అప్పులబాధతో ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు.

యాదగిరిగుట్ట: నల్లగొండ జిల్లాలో అప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ యువరైతు మృతి చెందాడు. యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన వీరు నాయక్(30) కౌలు రైతు.

వ్యవసాయం సాగు కలిసి రాకపోవడంతో సుమారు రూ.5 లక్షల మేర అప్పులయ్యాయి. అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 17న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. నాయక్ మృతితో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement