అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Apr 30 2015 12:28 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా ఆలేరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

నల్గొండ: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లా ఆలేరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన గుంటుక వేణుగోపాల్ రెడ్డి(45) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేణుగోపాల్ రెడ్డికి ఐదెకరాల పొలం ఉంది. అది సాగు చేయడం కోసం చేసిన అప్పులు ఎక్కువవడంతో తీర్చే దారి కనిపించక ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement