నేడు లండన్‌కు విద్యామంత్రి, డీఎస్‌ఈ | Education in London today, DSE | Sakshi
Sakshi News home page

నేడు లండన్‌కు విద్యామంత్రి, డీఎస్‌ఈ

Jan 17 2015 12:49 AM | Updated on Sep 2 2017 7:46 PM

లండన్‌లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ప్రపంచ విద్యా సదస్సుకు (ఎడ్యుకేషన్ వరల్డ్ సమ్మిట్) హాజరయ్యేందుకు....

సాక్షి, హైదరాబాద్: లండన్‌లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ప్రపంచ విద్యా సదస్సుకు (ఎడ్యుకేషన్ వరల్డ్ సమ్మిట్) హాజరయ్యేందుకు నేడు (శనివారం) తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పాఠశాల విద్యా డెరైక్టర్ (డీఎస్‌ఈ) చిరంజీవులు లండన్‌కు బయలుదేరి వెళ్తున్నారు. తిరిగి ఈ నెల 23న హైదరాబాద్‌కు రానున్నారు. సదస్సులో పాల్గొనడంతోపాటు అక్కడి విద్యా విధానాలను వారు పరిశీలించనున్నారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ అమలుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో దీన్ని అమలు చేసేందుకు అనుకూలమైన విధానాలపై అధ్యయనం చేయనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement