- సమగ్ర సర్వేతో అభివృద్ధి కలెక్టర్ ప్రియదర్శిని
- జెడ్పీలో ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం
- అపోహలు తొలగించాలి : కాంగ్రెస్ పునర్నిర్మాణం కోసమే : టీఆర్ఎస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ ఆర్థిక, సామాజిక సర్వే-2014పై జిల్లాకు చెందిన శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అవగాహన సమావేశం నిర్వహించారు. ఒకే వ్యక్తి అనేక చోట్ల వివరాలు నమోదు చేసుకోకుండా ఉండేందుకే ఒకే రోజులో సమగ్ర సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. సర్వే సమయంలో అందుబాటులో ఉండే వారి వివరాలు మాత్రమే నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఇతర ప్రాంతాల్లో చదువుతున్న వారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాల నమోదుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ప్రియదర్శిని వివరించారు. గుంపు మేస్త్రీల ద్వారా వలస కూలీల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో తొమ్మిదిన్నర లక్షల కుటుంబాల వివరాల సేకరణకు 40వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే సర్వే నిర్వహించడం సరికాదని, వలస వెళ్లిన వివరాల నమోదుకు మరో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ శాసన సభ్యులు డీకే అరుణ, చిన్నారెడ్డి, రామ్మోహన్రెడ్డి సూచించారు. సర్వేపై అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ స్పష్టం చేశారు. సర్వే నిర్వహణపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ శర్మన్, జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
ఇంట్లో ఉంటేనే పేరు నమోదు
Published Tue, Aug 12 2014 3:57 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement