యాగం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ | CM KCR visits Jagadevpur | Sakshi
Sakshi News home page

యాగం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

Dec 5 2015 7:48 PM | Updated on Aug 14 2018 10:54 AM

చండీయాగం పనుల వేగం పెంచాలని నిర్వాహకులకు సీఎం కేసీఆర్ సూచించారు.

జగదేవ్‌పూర్ (మెదక్) : చండీయాగం పనుల వేగం పెంచాలని నిర్వాహకులకు సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా ఎర్రవల్లి సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి ఆయన చేరుకున్నారు. మొదట చండీయాగం స్థలానికి చేరుకుని పరిశీలించి, పనులపై ఆరా తీశారు. అనంతరం నిర్వాహకులకు పలు సూచనలు చేసినట్టు తెలిసింది.

సీఎం అరగంటపాటు అక్కడే ఉండి పనుల గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతి ముందస్తుగానే ఫాంహౌస్‌కు చేరుకుని పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు. రాత్రి వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం బస చేస్తారు. ఆదివారం ఉదయం చండీయాగం పనులను మళ్లీ పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే ఎర్రవల్లిలో కొనసాగుతున్న డబుల్ బెడ్‌రూం పనులను కూడా సీఎం కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement