ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్‌ భేటీ

CM KCR Meet RTC Workers In Pragati Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులతో భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకి ఐదుగురు చొప్పున సీనియర్‌ కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశ అనంతరం కార్మికులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు.

ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని కార్మికులకు తెలియజేసేందుకే  సీఎం కేసీఆర్‌ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే కార్మికుల సమస్యలు ఏంటో నేరుగా వారినే అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను నేరుగా సీఎంకే వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి తమను ఆదుకుంటానని హామీ ఇచ్చారని కార్మికులు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top