భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌

Big Encounter in Bhadradri Kothagudem District - Sakshi

సాక్షి, భద్రాద్రి : జిల్లాలో ఈ ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం మేలపల్లి అటవీప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. 

చంద్ర పుల్లారెడ్డి వర్గీయులు, పోలీసుల మధ్య ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మరోపక్క గ్రేహౌండ్స్‌ దళాల కాల్పుల్లో మరో మావోయిస్టు కూడా మృతి చెందాడు. చనిపోయిన వారిని ఈసం నరేష్‌, తిరుకులూరి మధు, భూక్య నర్సింహా, మేకల సమ్మయ్య, సుభాష్‌, బోయిని ఓంప్రకాశ్, రామస్వామి, రషీద్‌ గా గుర్తించారు. ఘటనలో 2 ఎస్‌ఎల్‌ఆర్‌, రెండు రైఫిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top