జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట ఏఎస్ఐ గుండెపోటుతో మృతి చెందారు.
గుండెపోటుతో ఏఎస్ఐ మృతి
Aug 18 2017 4:23 PM | Updated on Aug 20 2018 5:11 PM
మంగపేట : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తోన్న దోబి.సారయ్య(57) గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. సారయ్యది ములుగు మండలం రాయిగూడెం. గత వారం రోజులుగా సెలవులో ఉన్న సారయ్య శుక్రవారం విధులకు వెళ్లారు. అక్కడ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఎస్ఐ మహేందర్, సారయ్యను ఏటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందారు.
Advertisement
Advertisement