ఇద్దరు బైకు దొంగల అరెస్ట్ | 2 thefts arrested in chaitanyapuri | Sakshi
Sakshi News home page

ఇద్దరు బైకు దొంగల అరెస్ట్

Mar 2 2015 8:12 PM | Updated on Sep 4 2018 5:16 PM

ఇద్దరు బైకు దొంగల అరెస్ట్ - Sakshi

ఇద్దరు బైకు దొంగల అరెస్ట్

ఇద్దరు బైక్ దొంగలను నగరంలోని చైతన్యపురి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ : ఇద్దరు బైక్ దొంగలను నగరంలోని చైతన్యపురి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగోల్ కు చెందిన ఆటోడ్రైవర్ మద్ది వినోద్ (19), కూలి పనిచేసే చింతకాయల రాము (19) గత కొంత కాలంగా పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం అదుపులోకి తీసుకుని వారి నుంచి రు.6 లక్షల విలువైన బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
(చైతన్యపురి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement