breaking news
-
బీఆర్ఎస్లోనే.. ఆ ఆలోచన ఎంతమాత్రం లేదు: సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల జంపింగ్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్రెడ్డి, కాలె యాదయ్యలు పార్టీని వీడి అధికార కాంగ్రెస్లోకి చేరారు. ఈ క్రమంలో.. మరో ఐదుగురు ఉన్నారని, మాజీ మంత్రి సబితా రెడ్డి కూడా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ఒకటి నడుస్తోంది. అయితే.. సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారాన్ని ఖండించారామె. బీఆర్ఎస్లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారన్న సబిత.. ఆయన సారధ్యంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, పార్టీ మారాల్సిన అవసరంగానీ.. ఆ ఆలోచనగానీ తనకు లేవని అన్నారామె. -
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు.. పిటిషన్ కొట్టివేత
సాక్షి హైదారాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ వాదనలతోనే ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం.. కేసీఆర్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు సోమవారం ఉదయం వెల్లడించింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్, జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది. ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో.. ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా, దీని విచారణ అర్హతపై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు. అయితే.. పద్దతి ప్రకారమే విచారణ జరగుతోందని, ట్రాన్స్కో జెన్కో అధికారుల్ని సైతం విచారించిందని,ఈ పిటిషన్కు అసలు విచారణ అర్హత లేదని ప్రభుత్వం తరుపున ఏజీ సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. దీంతో ఏజీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసీఆర్ రిట్ పిటిషన్ను కొట్టేసింది. దీంతో గులాబీ బాస్ తర్వాత ఏం చేయబోతున్నారో? అనే ఆసక్తి నెలకొంది. -
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): నిరుద్యోగులు, నిరుద్యోగ సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. నిరుద్యోగ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏడు రోజులుగా గాం«దీఆస్పత్రిలో ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిస్తున్న నిరుద్యో గ జేఏసీనేత మోతీలాల్నాయక్ను ఆదివారం హరీశ్రావు పరామర్శించి మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా మోతీలాల్నాయక్తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగ యువతతో చర్చలు జరిపి, ఇచి్చన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారుఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మోతీలాల్నాయక్ దీక్షను విరమించాలని, కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల హక్కుల పట్ల ప్రొఫెసర్ కోదండరాం పూర్తి బాధ్యత తీసుకొని, హామీలు అమ లు చేసేవిధంగా కృషి చేయాలని కోరారు. ఏడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేకపోవడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులపై కపటప్రేమ చూపించి అవసరం తీరిన తర్వాత వారి గుండెల మీద తన్నిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికల ముందు నిరుద్యోగుల ఓట్ల కోసం కోదండరాం, రియాజ్, బల్మూరి వెంకట్, మురళి, రేవంత్రెడ్డి తదితరులు కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారని, బస్సుయాత్రలు చేశా రని, రాహుల్గాంధీని అశోక్నగర్ తీసుకొచ్చి ప్రమాణం చేయించారని గుర్తు చేశారు. వారికి ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యో గులకు రాలేదన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా రేవంత్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాసయాదవ్, ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ పాల్గొన్నారు.ఇవీ నిరుద్యోగ డిమాండ్లు..⇒ గ్రూప్–1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1: 50 నుంచి 1:100కు పెంచాలి. ⇒ గ్రూప్–2కు రెండువేలు, గ్రూప్–3కి 3 వేల ఉద్యోగాలు కలుపుతామనే హామీ నిలబెట్టుకోవాలి. రెండు పరీక్షల మధ్య 2 నెలల సమయం ఉండాలి ⇒ ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనే హామీ నిలబెట్టుకోవాలి. ⇒ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ⇒ మొదటి కేబిబినెట్ మీటింగ్లోనే మెగా డీఎస్సీ ప్రకటన హామీ నిలబెట్టుకోవాలి. 11 వేలతో కాకుండా 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి ⇒ గురుకుల టీచర్ల పోస్టులను బ్యాగ్లాగ్లో పెట్టకుండా, హైకోర్టు తీర్పు ప్రకారం పోస్టులు భర్తీ చేసి అభ్యర్థులు, నిరుద్యోగులకు న్యాయం చేయాలి ⇒ జీఓ నంబరు 46 రద్దు చేయాలి. ఆ జీఓ ద్వారా ఏర్పడిన సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలి. ⇒ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఏడు నెలల బకాయితో సహా ప్రతినెల క్రమం తప్పకుండా నిరుద్యోగభృతి చెల్లించాలి అని హరీశ్రావు డిమాండ్ చేశారు. -
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: ఎమ్మెల్యే తలసాని
సనత్నగర్ (హైదరాబాద్): తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద ఆదివారం నిర్వహించిన సనత్నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన సోదరుడు శంకర్యాదవ్ మరణం విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదన్నారు. శంకర్యాదవ్తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉందని, ఆ కారణంగానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు. -
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది: బండి సంజయ్
కరీంనగర్ టౌన్: ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిధుల కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు. కరీంనగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ అభి వృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నా మని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే సహకరిస్తున్నా మని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులిచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కేంద్రం పార్టీలకఅతీతంగా ఎంపీలకు నిధులిస్తుందని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పవన్కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీని పై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టీ 20 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని, 140 కోటమంది ఆనందంతో ఉన్నారని తెలిపారు. -
ఏడు నెలలు దాటిపోయింది.. కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటిపోయింది.. ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.. నోటిఫికేషన్ జారీ చేయకుండానే 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారు? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్(ట్విట్టర్) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు.‘‘రాహుల్ గాంధీ గారు. మీరు వ్యక్తిగతంగా నిరుద్యోగులను కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేస్తామని తెలంగాణ యువకులకు హామీ ఇచ్చారు. మీ పార్టీ మీ వాగ్దానాన్ని అనుసరించే తేదీలతో పాటు అన్ని ప్రముఖ వార్తాపత్రికలలో ఉద్యోగ క్యాలెండర్ కూడా ప్రచురించింది. ఇప్పటికి 7 నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు.’’ అంటూ మండిపడ్డారు.‘‘ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయకుండానే 2 లక్షల రిక్రూట్మెంట్ ప్రక్రియను మీ ప్రభుత్వం ఎలా అందిస్తుంది?. తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యులు ఎవరూ పట్టించుకోనందున దయచేసి స్పందించండి.’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.Dear @RahulGandhi Ji,You had personally met, promised the Telangana youngsters that recruitment of 2 lakh government jobs would be completed within the first one year of Congress assuming office Your party also published “job calendar” (full page advertisements) in all… pic.twitter.com/VNZL2zyqvu— KTR (@KTRBRS) June 30, 2024 -
సంపద సృష్టిస్తాం.. ప్రజలకు పంచుతాం: భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మధిర నియోజకవర్గంలోని చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.రాష్ట్ర సంపద రాష్ట్ర ప్రజలకు చెందాలని తమ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను తీసుకువచ్చిందన్నారు. గత దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామని చెప్పారు. సంపదను సృష్టించి, సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్థికంగా ఎదగడానికి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగించామన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్ప చెప్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కొరకై తమ ప్రభుత్వం మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు.ఆసుపత్రి ప్రారంభం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనహైద్రాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు చేరుకున్న డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలికారు. ఉదయం 11 గంటలకు ఆర్సీఎం చర్చ్ ఎదురుగా స్థంబాద్రి హస్పిటల్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రి మూడవ అంతస్తులో క్యాత్ ల్యాబ్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఆక్కడి నుంచి చింతకాని మండలం గాంధినగర్ కు చేరుకొని రూ.175లక్షలతో గాంధినగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.ఆ తరువాత మధిర మండలం వంగవీడు గ్రామానికి చేరుకొని రూ. 30 కోట్లతో బోనకల్లు- అల్లపాడు- వంగవీడు గ్రామాల వరకు బిటి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. చిలుకూరు గ్రామాంలోని శివాలయం వద్ద రూ.70 లక్షలతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, రూ.285 లక్షలతో చిలుకూరు నుంచి దొడ్డదేవరపాడు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర మండలం మర్లపాడు గ్రామానికి చేరుకొని. రూ.275 లక్షలతో మర్లపాడు నుంచి పెనుగొలను-సిద్దినేని గూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్తాపన చేశారు. ఆ తరువాత మాటూరు గ్రామానికి చేరుకొని రూ.500 లక్షలతో మాటూరు నుంచి ముస్లీం కాలనీ బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆనంతరం స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దారి పొడవున ఆయా గ్రామాల ప్రజలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు ఘనంగా స్వాగతం పలికారు. -
మోతీలాల్కు ఏదైనా జరిగితే రేవంత్దే బాధ్యత: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను ఎన్నికల కోసమే వాడుకుంది. కాంగ్రెస్ నాయకులకు ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదో సీఎం రేవంత్, కోదండరామ్ సమాధానం చెప్పాలన్నారు.కాగా, హరీష్ రావు ఆదివారం గాంధీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏడురోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా దీక్ష విరమించాలని కోరారు. అనంతరం, హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. మోతీలాల్ దీక్ష చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు దీక్ష విరమించనని మోతీలాల్ అంటున్నాడు. మేము దీక్ష విరమించాలని కోరాము. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది.మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన ఆరోగ్యానికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి మోతీలాల్ మాట్లాడాలి. లేదంటే అసెంబ్లీని స్తంభింపజేస్తాం. బీఆర్ఎస్ నిరుద్యోగుల పక్షాన నిలబడుతుంది. నిరుద్యోగుల బాధ్యత కోదండరామ్ తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.ప్రభుత్వం మొద్ద నిద్రలో ఉంది. నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకుంది. వారంతా ఇప్పుడు అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. కానీ, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని అన్నాడు. కానీ, ఇంతవరకు అతీగతీ లేదు.ఈ విషయంలో రాహుల్ గాంధీకి ట్విట్టర్లో మెసేజ్ కూడా చేస్తున్నాం. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని సంతకాలు కూడా చేశారు. రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చెయ్యాలి. ప్-2, గ్రూప్-3లో ఉద్యోగాలు పెంచాలి. జీవో-45 ఎందుకు రద్దు చేయడం లేదు. 25వేల మెగా డీఎస్సీ విడుదల చేయాలి’ అని కోరారు. -
డీఎస్ చివరి కోరిక అదే.. మేము నెరవేర్చాం: సీఎం రేవంత్
సాక్షి, నిజామాబాద్: సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే, డీఎస్ కోరికను కూడా మేము నెరవేర్చాము అని తెలిపారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం నిజామాబాద్కు వెళ్లారు. ఈ సందర్భంగా డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుమారులు అర్వింద్, సంజయ్లను పరామర్శించారు. అనంతరం, సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానిక డీఎస్ కష్టపడ్డారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి శ్రీనివాస్. కొంత కాలం కాంగ్రెస్ పార్టీకి దూరమైన పార్లమెంట్లో డీఎస్ను సోనియా గాంధీ అప్యాయంగానే పలకరించేవారు.పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. చనిపోయినపుడు తనపై కాంగ్రెస్ జెండా కప్పి ఉంచాలన్నది డీఎస్ కోరిక. అందుకే ముఖ్య నాయకులను పంపి వారి కోరిక తీర్చాము. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు’ అంటూ కామెంట్స్ చేశారు. -
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహం సరైన పద్దతి కాదు. మేము ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునే అవసరం మాకు లేదు అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు.కాగా, బండి సంజయ్ ఆదివారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం, సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సింగరేణిని ప్రైవేటుపరంగా చేస్తున్నామని మాట్లాడటం హాస్యాస్పదం. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. ఈ వాటాతో కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుంది.అలాగే, రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు. గతంలో బీఆర్ఎస్ నడిచిన బాటలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పయనం కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. మరి మేము కూడా అలాగే ఆలోచిస్తే అనే విషయాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. మేము ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను మా పార్టీలో కలుపుకునే అవసరం మాకు లేదు. జనసేనతో పొత్తు అంశం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు చూసుకుంటారు’ అని అన్నారు.ఇదే సమయంలో టీ20 ప్రపంచకప్లో భారత్ విజయంపై బండి సంజయ్ స్పందిస్తూ..‘వరల్డ్కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు. ప్రతీ భారతీయుడు తామే విజయం సాధించినంత గొప్ప అనుభూతిని ఈ విక్టరీ అందించింది’ అని కామెంట్స్ చేశారు. -
మీ విచారణలో నిష్పాక్షికత లేదు
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సాధించిన అసాధారణ విజయాలకు మసిపూసేలా పనిచేస్తున్నారంటూ విద్యుత్ ఒప్పందాలపై ప్రభుత్వం నియమించిన కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి వ్యాఖ్యానించారు. మీ విచారణలో నిష్పాక్షికత లేదని, నిరాధారమైన ఆరోపణలకు ఊతమిచ్చేలా వ్యవహరించడం బాధాకరమంటూ ఏడు పేజీల లేఖను జగదీశ్రెడ్డి శనివారం తన పీఏ ద్వారా కమిషన్కు పంపించారు. అనంతరం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ ఉద్దేశాలను తప్పుబట్టారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.పద్నాలుగేళ్లు తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపారన్నారు. నిమిషం కరెంటు కోత లేకుండా రైతులు, పారిశ్రామికవేత్తలకు, గృహాలకు విద్యుత్ అందిస్తే... ఏదో జరిగిపోయిందన్నట్లుగా, జరిగిన నష్టాన్ని లెక్కకట్టడమే మిగిలిందన్నట్లుగా మాట్లాడడం, మరునాడే ఆరువేల కోట్ల నష్టం అని అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. విచారణ జరుగుతున్న సమయంలోనే ఇలాంటి వార్తలు వచి్చనందున వారికి ఆ సమాచారం ఎలా వచి్చంది, ఏ ఆధారాలతో ఆ వార్తను ప్రచురించారనే అంశాలు కూడా విచారణలో భాగం కావలసిన అవసరం ఉందని జగదీశ్రెడ్డి చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి రూ.3.90కి కొన్నాం తాము ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభంలో ఉందని, 2700 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని జగదీశ్ రెడ్డి లేఖలో వివరించారు. ఆ పరిస్థితుల్లో తెలంగాణకు వచి్చన 400 మెగావాట్ల సీలేరు జలవిద్యుత్ కేంద్రాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకుందని, ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ పీజీసీఐఎల్ మహారాష్ట్రలోని వార్ధా నుంచి డిచ్పల్లి వరకు ట్రాన్స్మిషన్ లైన్ నిర్మాణం ప్రారంభించిందని, పీజీసీఐఎల్లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్ధతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్న నిబంధన మేరకు ఛత్తీస్గఢ్తో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విద్యుత్ను రూ.17కు కొంటున్న పరి స్థితి ఉండగా, ఛత్తీస్గఢ్ నుంచి రూ.3.90కి యూని ట్ చొప్పున కొనాలని తెలంగాణ ఈఆర్సీ నిర్ణయించిందని వివరించారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు రూ.4.90కి విద్యుత్ తీసుకున్నారన్నారు. రాష్ట్ర కరెంటు డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో 17 ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని చెప్పారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ను 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, యాదాద్రి ప్లాంట్ను సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతో సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనే తేడా లేకుండా పోయిందని వివరించారు. -
వరంగల్ అభివృద్ధిపై సమీక్ష.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
సాక్షి, వరంగల్: హైదరాబాద్తో సమానంగా వరంగల్ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన వరంగల్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. హెరిటేజ్ సిటీగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. భూసేకరణకు అవసరమయ్యే నిధులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని ఆదేశించారు. నేషనల్ హైవే నుంచి నేషనల్ హైవేకు కనెక్ట్ అయ్యేలా ఔటర్ రింగ్ రోడ్డు ఉండాలన్నారు.ఔటర్ రింగ్ రోడ్డు నుంచి టెక్స్టైల్ పార్కుకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డుమార్గం ఉండేలా చూడాలన్న సీఎం. స్మార్ట్ సిటీ మిషన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. నాలాలు ఆక్రమణలకు గురి కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.వరంగల్ నగర అభివృద్ధిపై ఇకనుంచి ప్రతీ 20 రోజులకోసారి ఇంచార్జ్ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఆదేశించిన సీఎం.. నగర అభివృద్ధికి సంబంధించి సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వరంగల్లో డంపింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలన్న సీఎం.. ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ధర్మపురి శ్రీనివాస్కు ప్రముఖుల సంతాపం లైవ్ అప్డేట్స్.. కేసీఆర్ సంతాపం..👉ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేటీఆర్ సంతాపం..👉రాజకీయాల్లో అజాత శత్రువు ధర్మపురి శ్రీనివాస్. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన చనిపోవటం బాధాకరమైన విషయం. శ్రీనివాస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి👉ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే దానం నాగేందర్సీఎం రేవంత్ సంతాపం.. 👉ధర్మపురి శ్రీనివాస్ పట్ల సీఎం రేవంత్ సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డీఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంతాపం..👉 ఈరోజు చాలా బాధాకరమైన రోజు. శ్రీనివాస్కు కాంగ్రెస్ అంటే ప్రాణం. మాలాంటి ఎంతోమంది ఎదుగుదలకి ధర్మపురి శ్రీనివాసే కారణం. డీఎస్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తన్నాం. 👉కాంగ్రెస్ నేతల నివాళులు..కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి.శ్రీనివాస్ ఒకరని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డీఎస్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడిగా డీఎస్ సేవలు గుర్తు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, వారి కుటుంబసభ్యులకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. వీరితో పాటు డీఎస్ మృతిపట్ల మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, వి.హనుమంతరావు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి డి.శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, డీఎస్ గొప్ప నాయకునిగా ఎదిగారని కొనియాడారు. సామాన్య స్థాయి నుంచి పీసీసీ అధ్యక్షుడు, మంత్రిగా పని చేసే స్థాయికి ఆయన ఎదిగారని గుర్తు చేశారు. డీఎస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్టిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.👉కిషన్ రెడ్డి సంతాపం..ధర్మపురి శ్రీనివాస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరువలేనిది.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బీజేపీ ఎంపీ అరవింద్, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.👉డీఎస్ మృతి బాధాకరం: డీకే అరుణడీఎస్ తనయుడు ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వారి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చిన డీకే అరుణ. మంత్రిగా, పీసీసీ చీఫ్గా, ఎంపీగా డీఎస్ చేసిన సేవలు మరువలేనివి. శ్రీనివాస్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను. 👉డీ శ్రీనివాస్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే, నారా లోకేష్ కూడా సంతాపం ప్రకటించారు. 👉తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు. -
పోరాడు, భయపడకు అని నేర్పింది నాన్నే: ఎంపీ అర్వింద్ భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుండెపోటుతో చనిపోయారు.కాగా, తన తండ్రి మరణంతో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ సందర్భంగా అర్వింద్ తన తండ్రిని తలుచుకుంటూ బావోద్వేగానికి లోనయ్యారు.ఈ క్రమంలో అర్వింద్ సోషల్ మీడియా వేదికగా.. ‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
కార్యకర్తలనే నేతలుగా చేస్తా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి వెళ్లి దొంగల్లో కలుస్తున్న నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, వారి గురించి బాధ పడొద్దని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. సమైక్యవాదులతో నిలబడి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఎంతమాత్రం లెక్క కాదన్నారు. ఒక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్తే పది మంది నాయకులను తీర్చిదిద్దుకునే సత్తా బీఆర్ఎస్కు ఉందని చెప్పారు. ‘తెలంగాణ ఉద్యమ సాధన కోసం నడుం కట్టినపుడు మనతో ఎవరున్నారు? నాడు, నేడు, ఏనాడైనా నాయకులను పార్టీయే తయారు చేసుకుంటుంది. పార్టీ తయారు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే దొంగల్లో కలిశాడు. భవిష్యత్తులో అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారు చేసుకుంటుంది. భవిష్యత్తులో కార్యకర్తల నుంచి మెరికల్లాంటి యువ నాయకులను సృష్టిస్తా..’అని కేసీఆర్ అన్నారు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచి్చన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో ఆయన భేటీ అయ్యారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్సే‘తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు అనేకం మిగిలి ఉన్నాయి. తెలంగాణ ఆకాంక్షలు, కలలు నెర వేర్చగలిగే అవగాహన బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకు ని పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన మన పారీ్టకే ఉంది.ప్రజాస్వామ్య వ్యవస్థలో అబద్ధపు ప్రచారాలకు లోనై కొన్నిసార్లు ప్రజలు బోల్తా పడుతుంటారు. మొన్నటి ఎన్నికల్లో అలా జరిగినంత మాత్రాన నిరుత్సాహపడొద్దు. అధికారం ఉంటేనే పని చేస్తామనే పద్ధతిని వీడి ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాలి. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి బీఆర్ఎస్ అంతిమ లక్ష్యం. నెరవేరాల్సిన ప్రజల కలలను పూర్తి స్థాయిలో నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే..’ అని కేసీఆర్ చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి ‘మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజల కోసం పనిచేయాల్సి ఉంది. ప్రజలు పదేళ్లు అధికారమిస్తే కులమతాలకు అతీతంగా పనిచేసి వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచి ప్రజా సమస్యలు పరిష్కరించాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాం..’అని బీఆర్ఎస్ అధినేత పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ప్రజా సేవతో మన్ననలు పొందుతున్నారని అభినందించారు.ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్రెడ్డి, జాజుల సురేందర్, గంప గోవర్దన్, హనుమంతు షిండే, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేశ్, పెద్దపెల్లి బీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నేతలతో ప్రత్యేకంగా జరిపిన భేటీలో పార్టీ బలోపేతంపై కేసీఆర్ చర్చించారు. సందడిగా ఎర్రవల్లి పరిసరాలు కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తుండటంతో ఫామ్ హౌస్ పరిసరాలు సందడిగా మారాయి. వాహనాల రద్దీతో హడావుడి నెలకొంది. నినాదాలు చేస్తూ పోటెత్తుతున్న నేతలు, కార్యకర్తలు కేసీఆర్కు పుష్పగుచ్చాలు, మొమెంటోలు ఇచ్చి ఫోటోలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. ఆత్మియ సమావేశాలకు విరామం మూడు రోజుల పాటు కేసీఆర్కు విశ్రాంతి సాక్షి, హైదరాబాద్: ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలకు మూడు రోజుల పాటు విరామం ప్రకటించారు. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు కేసీఆర్కు విశ్రాంతి ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఆత్మియ సమావేశాలు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది వెల్లడిస్తామని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండు వారాలుగా కేసీఆర్ ఆత్మియ సమావేశాలు కొనసాగిస్తుండగా, పక్షం రోజుల్లో సుమారు 50 వేల మందికి పైగా మంది కార్యకర్తలు, ప్రజలు ఆయనతో భేటీ అయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందస్తు సమాచారం అందుకుని కేసీఆర్ను కలుస్తున్నారు. ఎర్రవల్లి నివాసానికి వస్తున్న వారిని కేసీఆర్ పలకరిస్తూ వారితో ఫొటోలు, సెలీ్ఫలు దిగుతున్నారు. ఈ ఆత్మియ సమావేశాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా షెడ్యూల్ను ప్రకటిస్తామని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ప్రభుత్వరంగ సంస్థల భూములను వెనక్కి ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు (పీఎస్యూ) రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి శ్రీధర్బాబు కాంగ్రెస్, బీజేపీ నేతలతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తో భేటీ అయ్యారు. పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తోందని, వీటి ఆ«దీనంలో ఉన్న మిగులు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలని శ్రీధర్బాబు కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 70 ఏళ్లలో అనేక ప్రభుత్వరంగ సంస్థలను ఏర్పాటు చేసిందని, వాటి ఏర్పాటు కోసం అప్పట్లో వేలాది ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరా రు. ఖాయిలా పడిన ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. 4 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామ ర్ధ్యం కలిగిన సీసీఐ ఆదిలాబాద్ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2,100 ఎకరాల సున్నపురాతి గనులతో పాటు మొత్తం 2,290 ఎకరాల భూమిని ఉచితంగా ఇచి్చన విషయాన్ని గుర్తు చేశారు.రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, సులభతర వాణిజ్యంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు ఉన్నాయని, వీటితో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఉన్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని శ్రీధర్బాబు కోరారు. త్వరలో హైదరాబాద్లో పర్యటించి శ్రీధర్బాబు ప్రస్తావించిన అంశాలపై అధికారులతో చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. -
పేర్లు ఫైనల్.. మిగిలింది ప్రకటనే!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. దీనితోపాటు పీసీసీ కొత్త చీఫ్ ఎంపిక, నామినేటెడ్ పదవుల జాబితానూ కొలిక్కి తెచ్చినట్టు సమాచారం. జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పార్టీలో పనిచేసిన అనుభవం, సీనియారిటీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపిక జరిగినట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి పోటీచేసి, గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు కలి్పంచాలని, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చి న వారికి అవకాశం ఇవ్వకూడదని అధిష్టానం నిర్ణ యించినట్టు పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమెల్యేలకు కీలక పదవులు దక్కే అవకాశం లేదని అంటున్నాయి. వరుసగా నేతలతో భేటీలు.. కీలక పదవుల పంపకాలపై ఢిల్లీలో ఐదు రోజులుగా వరుసగా భేటీలు జరుపుతున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు శుక్రవారం కూడా విడివిడిగా చర్చలు జరిపారు. సీఎంతో భేటీకి ముందే దీపాదాస్ మున్షీ తెలంగాణ భవన్లోని శబరి బ్లాక్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్బాబు లతో గంటన్నర పాటు చర్చించారు. మంత్రివర్గంలో తీసుకునేందుకు పరిశీలనలో ఉన్నవారందరి పేర్లపై అభిప్రాయం తీసుకున్నారు. ఒకరిద్దరి పేర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. మిగతా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలిసింది.ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ సహా నేతలంతా సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన పేర్లపై చర్చించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేర్లకు అందరూ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. మిగతా పేర్లలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, బల్మూరి వెంకట్, ప్రేమ్సాగర్రావు, వివే క్, బాలూనాయక్ తదితరుల పేర్లపై కొంత భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలిసింది. దీంతో వీటి నుంచి ఫైనల్ చేసే బాధ్యతను అధిష్టానంకు కట్టబెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్తగా చేరినవారికి ఎలా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్కుమార్ల లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదనపైనా భేటీలో చర్చించినట్టు తెలిసింది. దీనికితోడు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వచ్చే ందుకు సిద్ధమైన దృష్ట్యా.. వారికి ఎలాంటి హామీ ఇవ్వాలన్న దానిపైనా చర్చ జరిగినట్టు సమాచారం.చివరిగా ఈ భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి తదితరులు.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్లతో భేటీ అయ్యారు. పరిశీలనలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు, ఏకాభిప్రాయం కుదిరిన పేర్లపై వారితో చర్చించారు. పీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో నేతల అభిప్రాయాలను వారి దృష్టికి తెచ్చారు.రాష్ట్ర నేతలు తెలిపిన పేర్లను పరిశీలించి ఒకట్రెండు రోజుల్లో తెలియజేస్తామని.. జూలై మొదటివారంలో మంత్రివర్గ విస్తరణ చేసుకోవచ్చని అధిష్టానం పెద్దలు చెప్పినట్టు తెలిసింది. ఇక మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులేవీ కొత్తగా చేరిన వారికి అవకాశం ఇవ్వకుండా.. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. బీసీకే పీసీసీ చీఫ్ పదవి! పీసీసీ చీఫ్గా బీసీ వర్గ నేతకే చాన్స్ ఇవ్వాలని నేతలంతా అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఈ లెక్కన ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్లలో ఒకరికి అవకాశం దక్కవచ్చని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. వీరి విషయంలో ఏకాభిప్రాయం రాని పక్షంలో ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నాయి. -
ఫిరాయింపుదారులకు పదవులు ఉండవు
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వస్తున్న వారికి రాష్ట్ర మంత్రి వర్గంలో చాన్స్గానీ, నామినేటెడ్ పదవులుగానీ ఇచ్చే అవకాశం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ‘‘రాష్ట్ర మంత్రివర్గంలో, పీసీసీ, నామినేటెడ్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకే పదవులు దక్కుతాయి. కొత్తగా వచి్చ చేరిన నేతలకు పదవులు ఉండవు. కేవలం కాంగ్రెస్ నుంచి బీఫామ్లు తీసుకుని గెలిచిన వారికి, కాంగ్రెస్లో ఉన్న వారికే పదవులు వస్తాయి..’’ అని చెప్పారు. పార్టీ అనుబంధ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు. రేవంత్ గురువారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. వచ్చే నెల తొలివారంలో నియామకాలు కేబినెట్ విస్తరణ, పీసీసీ పదవుల విషయంలో అధిష్టానంతో చర్చ జరిగిందని.. అయితే ఎవరెవరికి ఇవ్వాలన్న దానిపై ఏ నిర్ణయం జరగలేదని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పడూ ఉంటుందని.. పదవులు పొందేవారిలో మహిళలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఎవరైనా ఉండవచ్చని చెప్పారు. జూలై మొదటి వారంలో మంత్రి వర్గ విస్తరణతోపాటు పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తవుతాయని వెల్లడించారు. రుణమాఫీకే మొదటి ప్రాధాన్యత తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత రైతు రుణమాఫీ అని రేవంత్రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి మూడు, నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రైతు భరోసాను అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇస్తామన్నారు. ఒక కుటుంబానికి రూ.2లక్షల వరకు మాత్రమే పంట రుణమాఫీ ఉంటుందని.. కుటుంబాలను గుర్తించడానికి రేషన్కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వివరించారు. కుటుంబంలోని వారు మూడు, నాలుగు లోన్లు తీసుకుని ఉన్నా.. అందరికీ కలిపి గరిష్టంగా రూ.2లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. గతంలో డబ్బున్నవారికి, ఫామ్హౌజ్లకు కూడా పథకాల సొమ్ము ఇచ్చారని.. నిజమైన లబి్ధదారులకు పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. భవిష్యత్తులో తప్పు జరగవద్దనే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులే రూ.7లక్షల కోట్ల మేర ఉన్నాయని రేవంత్రెడ్డి తెలిపారు. ఇతరత్రా మరో లక్ష కోట్లు అప్పులు ఉంటాయని చెప్పారు. ప్రతి నెలా రూ.7వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కొత్త లోన్ల కోసం ప్రయతి్నస్తూ, వడ్డీలు తగ్గించుకునేందుకు ప్రయతి్నస్తున్నామని వివరించారు. ఆగస్టు చివరి నాటికి బీసీ కమిషన్ కాల పరిమితి పూర్తవుతుందని.. కొత్త కమిషన్ నియామకం తర్వాతే రాష్ట్రంలో కులగణన చేపడతామని రేవంత్ తెలిపారు. ఆర్టీసీ లాభాల్లోకి వస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 80శాతానికి పెరిగిందని రేవంత్ చెప్పారు. ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టీసీ లాభాల్లోకి వస్తుందన్నారు. జిల్లాలపై కమిషన్ వేసి నిర్ణయం రాష్ట్రంలో జిల్లాలను కుదిస్తామనిగానీ, పెంచుతామనిగానీ తాము చెప్పలేదని రేవంత్ తెలిపారు. నియోజకవర్గాల డీలిమిటేషన్కు ఎలా కమిషన్ వేస్తారో.. అలా జిల్లాలపై ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. గత ప్రభుత్వం రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని విమర్శించారు. పాతబస్తీలో విద్యుత్ నిర్వహణ అదానీ సంస్థకు.. హైదరాబాద్ పాతబస్తీలో సరఫరా చేసిన విద్యుత్లో కేవలం 60శాతమే బిల్లులు వస్తున్నాయని రేవంత్ చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద పాతబస్తీ విద్యుత్ నిర్వహణ బాధ్యతను అదానీ సంస్థకు అప్పగించాలని నిర్ణయించామని తెలిపారు. ప్రధాని మోదీలా తాము ప్రభుత్వ రంగ సంస్థలను పల్లీబటానీల్లా ప్రైవేటుకు బదలాయించబోమని చెప్పారు. అదానీ వ్యాపారమేదీ చేయవద్దని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇప్పుడు తాము హైదరాబాద్లో అదానీ సంస్థకు ఆస్తులు రాసివ్వడం లేదని.. వారితో పెట్టుబడి మాత్రమే పెట్టిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఏది లాభమైతే అదే చేస్తామని.. గదుల్లో కూర్చుని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోబోమని పేర్కొన్నారు. -
‘ఆరు’ నూరవకుండా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో వలసల రాజకీయం జోరుగా సాగుతోంది. విపక్ష బీఆర్ఎస్ పారీ్టకి చెందిన నేతలకు అధికార కాంగ్రెస్ వల విసురుతోంది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు కారు దిగి హస్తం గూటికి చేరగా, తాజాగా కాలె యాదయ్య చేరికతో ఇప్పటివరకు కాంగ్రెస్ కండువా కప్పుకున్న గులాబీ ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. శాసనమండలిలో అధికార పారీ్టకి నామమాత్ర సంఖ్యాబలం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు లక్ష్యంగా కూడా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అప్రమత్తమైంది. పార్టీ బీ ఫామ్పై గెలిచిన నేతలు చేజారకుండా చూసేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు స్వయంగా రంగంలోకి దిగారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేసీఆర్.. వలసలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘ భేటీలు జరుపుతూ బీఆర్ఎస్లో కొనసాగితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. మరోవైపు పార్టీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతోనూ ఎర్రవల్లి నివాసంలో వరుస భేటీలు జరుపుతూ వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకరొకరుగా కీలక నేతల నిష్క్రమణ గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఒకరొకరుగా పార్టీ నుంచి నిష్క్రమించడం మొదలు పెట్టారు. వీరంతా పార్టీ అధికారంలో కొనసాగిన కాలంలో కీలక పదవులు అనుభవించిన వారే కావడం గమనార్హం. పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పార్టీని వీడిన ముఖ్య నేతల జాబితాలో ఉన్నారు.లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు అమిత్రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పారీ్టతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వజూపినప్పటికీ కడియం కూతురు కావ్య, ఎంపీలుగా ఉన్న రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, పి.రాములు తదితరులు ఇతర పారీ్టల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు.ఇక బీఆర్ఎస్ను వీడిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పదుల సంఖ్యలోనే ఉన్నారు. కాగా అధికారంలో ఉండగా కీలక పదవులు అనుభవించిన నేతలు కూడా చడీ చప్పుడు లేకుండా రాత్రికి రాత్రే పార్టీ మారడం బీఆర్ఎస్కు మింగుడు పడని వ్యవహారంగా మారగా..పార్టీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. గ్రేటర్, చుట్టూ జిల్లాలపై కాంగ్రెస్ దృష్టి అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది బీఆర్ఎస్ తరఫున గెలుపొందారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), డాక్టర్ సంజయ్ (జగిత్యాల), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) గులాబీ పారీ్టకి గుడ్బై కొట్టారు. తాజాగా కాలె యాదయ్య (చేవెళ్ల) కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్కు మెజారిటీ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి చేరికల కోసం కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మినహా మిగతా వారు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఉద్యమ కాలం నుంచి అనుబంధం ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు విముఖతతో ఉన్నారు. అయితే 2014, 2018 ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరి, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎందరు పారీ్టలో కొనసాగుతారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరి ప్రత్యేక రాష్ట్రంలో కీలక పదవులు అనుభవించిన నేతలు కేకే, కడియం, పోచారం తదితరులు సైతం పార్టీని వీడటం, మరోవైపు పార్టీ సృష్టించిన నాయకుడు డాక్టర్ సంజయ్ కూడా ని్రష్కమించడంతో ఎవరుంటారో, వీడతారో తెలియని పరిస్థితి బీఆర్ఎస్లో ఉందనే చర్చ జరుగుతోంది. భరోసా నింపుతున్న కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఒకరొకరుగా పార్టీనీ వీడుతుండటంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు. ఎర్రవల్లి నివాసంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నేరుగా లంచ్ భేటీలు జరుపుతున్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, తన వెంట నిలిచే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందంటూ భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యమ సమయంలోనూ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు, అప్పట్లో ఎదురొడ్డి నిలిచిన తీరును విడమరిచి చెప్తున్నారు.ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా పారీ్టలో కొనసాగాలని బుజ్జగింపు ధోరణిలో కోరుతున్నారు. మరోవైపు కింది స్థాయిలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతోనూ సమావేశమవుతున్నారు. దీంతో జిల్లాల నుంచి పార్టీ నేతలు కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి పోటెత్తుతున్నారు. అయితే కేసీఆర్తో భేటీ తర్వాత కూడా కాలె యాదయ్య పార్టీని వీడటం గమనార్హం. కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన మహబూబ్నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. కానీ లోక్సభ ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక, ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. దీంతో సమీప భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఔత్సాహికుల్లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న నాయకత్వాన్ని కాపాడుకోవడమే కాకుండా ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు.ఉద్యమ సమయంలో క్రియాశీలంగా పనిచేసిన యువ నాయకులకు క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గ్యాదరి కిషోర్తో పాటు ఎర్రోల్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఆంజనేయ గౌడ్, తొట్ల స్వామి యాదవ్, తుంగ బాలు వంటి నేతలకు క్రియాశీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. పారీ్టలో సుదీర్ఘంగా కొనసాగుతున్న వారికి రాష్ట్ర, జిల్లా కమిటీల్లో కీలక స్థానం ఇచ్చే దిశలో కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. -
బీఆర్ఎస్ను వీడి దొంగలతో కలిసేటోళ్ల గురించి బాధలేదు: కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: పార్టీని వీడి దొంగలతో కలిసెటోళ్ల గురించి బాధలేదని అన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మనకు ఇదో లెక్కనా అని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌజ్లో శుక్రవారం సమవేశమయ్యారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీయే నాయకులను తయారు చేస్తుంది తప్ప.. నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని తెలిపారు.. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీనే.. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుంది అని చెప్పారు.రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నదని చెప్పారు.బీఆర్ఎస్ శ్రేణులకు ప్రస్తుత పరిస్థితులు ఒక లెక్క కాదు. ఒకరు పోతే 10 మంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుంది. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకునే సత్తా.. బీఆర్ఎస్కు మాత్రమే ఉంది. కొన్ని సార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోతారు. మొన్నటి ఎన్నికల్లో అదే జరిగింది. మనం ఏ హోదాలో ఉన్న ప్రజల కోసం పని చేయాల్సిందే అని కేసీఆర్ స్పష్టం చేశారు. -
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్
సాక్షి,న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు హరీష్ రావు సూచించారు.మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక..ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఈడీ పలు అభియోగాలు మోపింది. మద్యం పాలసీలో రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఈడీ పేర్కొంది. అందులో..రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లు చెప్పింది. అంతేకాకుండా.. 292 కోట్ల నేరంలో కవిత పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ గూటికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్లోకి చేరారు. కాలె యాదయ్యకు సీఎం రేవంత్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కాగా, ఇటీవల మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి చేరారు. తాజాగా, బీఆర్ఎస్కు చెందిన మరో ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ బాట పట్టారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా నాలుగు రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం చర్చనీయాంశంగా మారింది.కాగా, యాదయ్య చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023లలో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 268 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. -
Nalgonda: బీఆర్ఎస్కు మరో షాక్
సాక్షి, నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. డీసీసీబీ ఛైర్మన్పై గొంగడి మహేందరెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో ఆయన పదవి కోల్పోగా.. కాంగ్రెస్ తరఫున వ్యక్తి నూతన ఛైర్మన్గా ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం తీర్మానంపై చర్చ, ఓటింగ్ జరిగింది. ప్రస్తుత చైర్మన్పై 10 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టారు. వారికి మరో ఐదుగురు బీఆర్ఎస్ డైరెక్టర్లు మద్దతు ఇచ్చారు. దీంతో డీసీసీబీలో ప్రస్తుత డైరెక్టర్ల సంఖ్య 19కు చేరింది. బీఆర్ఎస్ గొంగడి మహేందర్రెడ్డి పదవి కోల్పోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కుంభం శ్రీనివాస్ రెడ్డి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.