-
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పిటిషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. -
ఇద్దరు సీఎంల భేటీ.. పరువు పాయే.. అంతా తుస్సే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలామంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసినవారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తర్వాత ఇంతేనా.. ఏదో అయిపోతుందనుకుంటే ఇలా తుస్సుమనిపించారేమిటా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పేరుకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించినా అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించినా, ఆ తర్వాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్ నెస్ పోయినట్లయింది.ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగితే మంచిదే. విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణినే అవలంబించినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగినట్లు అనిపిస్తుంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ కు, రేవంత్ కు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతుంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు అనే సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీడీపీలో షేర్ అడుగుతామంటూ లీక్ లు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టకుండా చేశారన్న భావన కలుగుతుంది.ప్రత్యేకించి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని ఆస్తులలో తమకు వాటా రావాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలవారు కలిసి హైదరాబాద్ అభివృద్ది చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా చెల్లించిన పన్నులతో హైదరాబాద్ లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, వాటిలో షేర్ ఉంటుందన్నది ఏపీ వాదన. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్ ల లోని ఆస్తుల విభజన ద్వారా ఏపీకి న్యాయబద్దమైన వాటా వస్తుందని ఆశించినవారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ తమవేనని ఉద్ఘాటిస్తోంది. హైదరాబాద్ లో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉంటే, అందులో జనాభా నిష్పత్తి ప్రకారం ఏభై ఎనిమిది శాతం వాటా ఏపీకి వస్తాయని అనుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75 వేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవి చర్చకు వచ్చినట్లు అనిపించదు.ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇంత కీలకమైన రెండు రాష్ట్రాల సమావేశానికి రాకుండా తప్పించుకున్నారా? లేక చంద్రబాబు రమ్మనలేదో తెలియదు కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే, పవన్ కల్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రామోజీరావు సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేయడం, ఢిల్లీ టూర్ లో పవన్ కల్యాణ్ లేకుండానే ప్రధాని మోదీని, ఇతరకేంద్ర మంత్రులను చంద్రబాబు ఒక్కరే కలవడం, ఇప్పుడు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల కీలక చర్చలలో పవన్ కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్ ఇలాంటి అవమానకర ఘటనల విషయంలో పెద్దగా ఫీల్ కాకపోతుండవచ్చు. ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ భేటీ ఎజెండాను ఖరారు చేయడానికి సమావేశం పెట్టారుకానీ ఆయన ఎందువల్లనో పాల్గొనలేదు. ఈ సంగతి పక్కనబెడితే ఇద్దరు సీఎంలు కలిసిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడతారని అంతా ఊహిస్తారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ మీడియాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది తెలిసిన సంగతే. కానీ వారు మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి వెళ్లిపోయారంటేనే దాని అర్ధం ఈ సమావేశం ఫలప్రదం కాలేదని అనుకోవాలి.ఒకవేళ ఏ ఒక్కదానిపైన అయినా అవగాహన కుదిరితే దాని గురించి అయినా ఘనంగా చెప్పుకునేవారు. విభజన సమస్యల వల్ల తెలంగాణకు పెద్దగా నష్టం ఏమీ లేదు. ఎటుతిరిగి ఏపీకే ఈ సమస్యల సత్వర పరిష్కారం అవసరం. తద్వారా నిర్దిష్ట మొత్తంలో నిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందని అనిపిస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి తేల్చలేకపోతే చంద్రబాబు అంతటి సీనియర్ నేత వల్ల ఏపీకి ఏమి ఒరిగిందన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ లో భవనాలు ఇవ్వబోమని, కావాలంటే స్థలాలు ఇస్తాం.. బిల్డింగులు కట్టుకోండని రేవంత్ స్పష్టం చేశారంటే అది ఏపీకి నష్టం చేయడానికే ఆయన వెనుకాడడం లేదని అర్దం. దానిని చంద్రబాబు ఖండించలేకపోవడం, ఏపీ వాటా గురించి పట్టుబట్టలేకపోవడం ఆయన బలహీనత అనిపిస్తుంది. లేదా రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారని అనుకోవాలి.అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి ఏడువేల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఏపీ ఫిర్యాదు చేస్తోంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి, హోం మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. ఆయా అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రింకోర్టుకు కూడా వెళ్లింది. చంద్రబాబు దానిని కొనసాగిస్తారో, లేదో తెలియదు. ఇప్పుడు తెలంగాణ తమకే 24వేల కోట్ల మేర ఏపీ నుంచి రావాలని ఎదురుదాడి చేసింది. అయినా చంద్రబాబు దీనిపై నోరెత్తినట్లు కనిపించలేదు.పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలుగా ఉన్న ఏడింటిని ఏపీలో కలపడంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. వాటిలో కనీసం ఐదు గ్రామాలనైనా తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. దీనికి ఈ చర్చలలో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించినట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారని కథనం వచ్చింది. దానిని సానుకూలంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాదో లో ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అంత గట్టిగా ఉన్నా, భద్రాచలం పక్కన ఉన్న గ్రామాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా ఉండడం విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.కృష్ణా జలాలలో తెలంగాణ ప్రభుత్వం అధిక వాటా కోరుతోంది. దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి బాగా ఇబ్బంది వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంంల రేవంత్ తన మనుషుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యలు అసలు చర్చకే వచ్చినట్లు లేదు. ఇద్దరు సీఎంల భేటీ ముందడుగు అంటూ టీడీపీ మీడియా ఊదరగొట్టింది కానీ అది ఏ రకంగానో చెప్పలేకపోయింది. పైగా డ్రగ్స్ అంశంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారన్న వాదన వినవస్తోంది. డ్రగ్స్ అంశంలో ఇద్దరు డీజీపీలు సహకరించుకుని కఠినచర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. అది దేశ వ్యాప్త సమస్యగా ఉంది.అయినా ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు అదేదో ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడడం దారుణంగా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ తదితర నగరాలలో ఇది ఎంత పెద్ద సమస్యగా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయంగా వైఎస్సార్సీపీపై పిచ్చి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రచారం చేసి ఏపీ మంత్రులే రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడం శోచనీయం అని చెప్పాలి. 2017లో టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే ఏపీలో గంజాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీడియాకే చెప్పారు. అయినా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా టీడీపీ మంత్రులు మాట్లాడితే రాష్ట్రానికి ఏమి ప్రయోజనం వస్తుంది?ఏపీ డిమాండ్లకు ముకుతాడు వేయడానికి రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త లీకులు ఇచ్చినట్లు అనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం, ఓడరేవులలో వాటా ఇవ్వాలని, తిరుమల, తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నట్లు మీడియాలో వార్తలు ప్రచారం చేయించింది. అది సంచలనంగా మారింది. ఆ రకంగా ముందరికాళ్లకు బంధం వేయడంతో చంద్రబాబు అసలు కీలకమైన ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు మొదలైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించలేకపోయారా? అనే సంశయం ఏర్పడుతోంది.ఇటీవల తెలంగాణ కూడా తన ముఖ్యమే అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. అందువల్లే ఏపీ డిమాండ్లపై చంద్రబాబు పట్టలేదనిపిస్తుంది. వీటిపై పట్టుబట్టి రేవంత్ ను ఒప్పించలేకపోతే ఏపీకి ఆయన చాలా నష్టం చేసినవారు అవుతారని వేరే చెప్పనవసరం లేదు. అయినా చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా ఉంది కనుక ముందడుగు అని, ఏదో సాధించేశారనో రాయవచ్చుకానీ, వాస్తవరూపంలో ఏపీకి ఒక్క అంశంలో కూడా మేలు జరిగినట్లు అనిపించదు. ఈ మొత్తం ప్రక్రియ చూస్తే రాష్ట్రాల సమస్యల పరిష్కారం కన్నా, వేర్వేరు కూటములకు చెందిన చంద్రబాబు, రేవంత్ లు తాము రాజకీయంగా కలిసే ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బీజేపీలోకి రావాలంటే..రాజీనామా చేయాల్సిందే
కరీంనగర్టౌన్: ఇతర పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బీజేపీలోకి రావాలంటే.. తప్పనిసరిగా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత కేసీఆర్ ప్రభుత్వం విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే అవకాశాలున్నా, రాజకీయ లబ్ధి కోసం మరింత జటిలం చేసి సమస్యను నాన్చుతూ వచి్చందన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదని, రెండు రాష్ట్రాల సీఎంలు సఖ్యతతో ఉన్నారని, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే విభజన సమస్యల పరిష్కారం లభించే అవకాశముందని చెప్పారు. ఇప్పటికే కేసీఆర్ గోతికాడ నక్కలా ఈ భేటీని అడ్డం పెట్టుకొని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా అని ప్రయతి్నస్తున్నారు. ఈడీ కేసులు, ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై.. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు, బీజేపీకి సంబంధమే లేదని నరేంద్రమోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశాలు లేవన్నారు. ఎంపీ కేశవరావుతో రాజీనామా చేయించిన నేతలు..కాంగ్రెస్లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన నిజంగా బాగుంటే పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా/తీర్పు కోరాలని, ఒకవేళ ఉపఎన్నికలు జరిగితే కచి్చతంగా అన్ని స్థానాల్లో బీజేపీనే గెలుస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై.. స్టేట్ ప్రెసిడెంట్ మార్పు, నూతన అధ్యక్షుడి ఎంపిక అంశం పార్టీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందన్నారు. కొత్త నేతలకు అధ్యక్ష పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదని, ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధమైన పరిస్థితులుంటాయని చెప్పారు. ఆ పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని అధ్యక్షుడిని చేయాలనే దానిపై అన్నీ ఆలోచించి జాతీయనాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. రామాయణ్ సర్క్యూట్, రైల్వేలైన్పై.. రామాయణ్ సర్క్యూట్ కింద ఇల్లందకుంట, కొండగట్ట ఆలయాలను అభివృద్ధి చేసే అవకాశముందని బండి సంజయ్ చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చుతామని.. ప్రతిపాదనలు పంపాలని గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ మూర్ఖంగా వ్యవహరించారన్నారు. కరీంనగర్ –హసన్పర్తి రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే జరిగిందని, త్వరలోనే దీని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటారన్నారు. సీఎం రేవంత్రెడ్డి అడిగితే స్మార్ట్సిటీ మిషన్ గడువు పొడిగించలేదని, రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి వచి్చన విజ్ఞప్తి మేరకే కేంద్రం గడువు పొడిగించిందన్నారు. గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్కు మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని చెప్పారు. -
మైండ్గేమ్తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
మానకొండూర్ (కరీంనగర్): మైండ్గేమ్తోనే నాడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మైండ్గేమ్ ఆడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ..‘1995 ఆగస్టు 26న చంద్రబాబును బలపరుస్తూ ఇప్పుడే 110 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్కు చేరుకున్నారని ఈనాడు పత్రిక ఓ కథనా న్ని ప్రచురించింది. అది చూసిన 110 ఎమ్మెల్యేలు అప్పుడు వైస్రాయ్ హోటల్కు చేరుకున్నారు. అలా ఎమ్మెల్యేలందరూ వెళ్లి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు..ఇప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ మైండ్గేమ్ ఆడుతోంది’అని తెలిపారు.టీఆర్ఎస్గా మారుస్తాం..బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మారుస్తామని ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్తో చర్చిస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి శనివారం నాటి సమావేశంలో హడావుడే తప్ప ఏం సాధించారని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, వొడితెల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మేయర్ సునిల్రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు పాల్గొన్నారు. -
టార్గెట్ బీఆర్ఎస్! తెలంగాణలో ‘బాబు’ రాజకీయం షురూ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలంగాణలో అడుగుపెట్టగానే రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చిన చంద్రబాబు.. బీఆర్ఎస్ టార్గెట్గా సరికొత్త రాజకీయానికి సిద్ధమయ్యారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు..తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో అధికారిక సమావేశానంతరం తెలంగాణవాదులు ఊహించినట్టుగానే పావులు కదపడం మొదలుపెట్టారు. తెలంగాణలో తన రాజకీయశత్రువు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్గా పాత తెలుగుదేశం ప్రజాప్రతినిధులను ఏకం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో టీడీపీలో ముఖ్య నాయకులుగా ఉండి బీఆర్ఎస్లోకి వెళ్లి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారితో చంద్రబాబు టచ్లోకి వెళ్లినట్టు తెలిసింది. ఆదివారం బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ప్రకాశ్గౌడ్ (రాజేంద్రనగర్) చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్లో నెలకొన్న పరిస్థితులపై వారితో చర్చించి , భవిష్యత్ చూసుకోవాలని సూచించినట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పట్లో టీడీపీ తెలంగాణలో బలపడే అవకాశం లేనందున, ముందు కాంగ్రెస్లోకి వెళ్లి బీఆర్ఎస్ను దెబ్బతీయాలని హితబోధ చేసినట్టు సమాచారం. చంద్రబాబును కలిసిన ఇద్దరితోపాటు బీఆర్ఎస్కు చెందిన జీహెచ్ఎంసీ పరిధిలోని 8 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజకీయం తెలంగాణలో చర్చనీయాంశమైంది. వీరే కాకుండా కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతిని«ధులు కూడా కాంగ్రెస్లో చేరేలా మంత్రాంగం నడుస్తుందని సమాచారం. ఎన్డీఏ కీలకనేతగా ఉంటూ కాంగ్రెస్కు మద్దతు ! రెండు కళ్ల సిద్ధాంతంతో టీడీపీ ఓవైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే, తెలంగాణలో కాంగ్రెస్కు అండగా నిలుస్తూ సంకీర్ణ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖిస్తోందనే చర్చ సాగుతోంది. ఎన్డీఏలో భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులెవరూ తెలంగాణకు వచ్చిన చంద్రబాబును కలవకపోగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. విభజన సమస్యల పేరుతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో శనివారం సమావేశమైన చంద్రబాబు ఆదివారం పూర్తిగా రాజకీయ సమావేశాలతోనే గడపడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించడం అందుకు ఉదాహరణ.ఆ తర్వాతే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాబుతో సమావేశమయ్యారు. వీరి బాటలోనే మరికొందరు టీడీపీ మాజీ నేతలు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చే పనిలో ఉన్నారని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని చేసిన వ్యాఖ్యలను రాజకీయవర్గాలు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నాయి.తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కళ్లు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగురాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్భవన్కు వచ్చారు. అంతకుముందు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం నుంచి పార్టీ కార్యాలయం వరకు తెలంగాణ టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణగడ్డపై టీడీపీకి పూర్వవైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో విజయానికి పరోక్షంగా కృషి చేసిన తెలంగాణ పార్టీశ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అధికారంలో లేకున్నా కార్యకర్తలు పార్టీని వదల్లేదని చెప్పారు. తెలంగాణలో నాలెడ్జి ఎకానమీకి తాను సీఎంగా ఉమ్మడిరాష్ట్రంలో నాంది పలికినట్టు చంద్రబాబు చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధిని కొనసాగించాయన్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చూపిన చొరవ అభినందనీయమని చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్కు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగురాష్ట్రాల మధ్య ఐకమత్యం ఉండాలని, వివాదాలుంటే నష్టాలే ఎక్కువ అని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయని, సిద్ధాంతపరంగా ఆలోచనలు వేరుగా ఉన్నా, తెలుగుజాతి ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. -
‘ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది’.. జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘నేను ఎమ్మెల్యేగా ఒడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నా. మనస్ఫూర్తిగా చెబుతున్న మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో నేనే రిలాక్స్ అవుతున్నా. నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నేను ఓడిపోయానని బాధపడొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి పనులు చేసుకుందామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి ప్రజల కోసం మనం జవాబుదారీగా ఉండాలని సూచించారు.‘‘సంగారెడ్డి ప్రజల కోసం రెండు నెలల తర్వాత ప్రతి సోమవారం సంగారెడ్డిలోని రాంనగర్ లో నా ఇంటి వద్ద అందిబాటులో ఉంటా. కార్యకర్తలు ఎవరు గాంధీ భవన్ కి రావొద్దు...మీరు వస్తే నేను కలవలేను..మాట్లాడలేను. నా కూతురికి పెళ్లి చెయ్యాలి..కొడుకు బిజినెస్ పెడుతా డబ్బులు కావాలంటున్నాడు. అప్పులు తీర్చడానికే నా జీవితం సరిపోతుంది. ఈ 20 ఏళ్లలో సంగారెడ్డిలో బోనాలు, దసరా ఉత్సవాల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని జగ్గారెడ్డి‘‘ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం.. మాజీ ఎంపీ వినోద్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం. ఏస్, అందులో నేనూ ఓ పాత్రధారినే అంటూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మానకొండూరులో జరిగిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్తో మాట్లాడి తెలంగాణ అనే అంశంతో ముడివిడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పవర్లో లేకపోవచ్చు కానీ.. పవర్ ఫుల్ పార్టీ అన్నారాయన. -
మాతో టచ్లో 26 మంది ఎమ్మెల్యేలు.. వాళ్లు బీజేపీలోకి వస్తే: బండి సంజయ్ వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ప్రజా తీర్పుతో గెలిచిన కొందరు నేతలు పార్టీలు మారుతున్నారు. ఎవరూ ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ మరో బాంబు పేల్చారు. తమతో 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పుకొచ్చారు.కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. రాహదారులపై ఈరోజు ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష చేస్తున్నాను. ప్రసాదం, రామాయణ్ సర్క్యూట్ స్కీమ్స్ ద్వారా వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. రాబోయే రోజుల్లో కరీంనగర్- హసన్పర్తి రైల్వే లైన్ ప్రణాళికకు రూపొందిచబోతున్నాం. దాని వల్ల కరీంనగర్ వాణిజ్యపరంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కరీంనగర్కు త్రిబుల్ ఐటీ వంటి విద్యాసంస్థల కోసం ప్రయత్నం చేస్తాను.ఇక, తెలంగాణలో రాజకీయాలకు వస్తే రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు. కానీ, వారంతా బీజేపీలోకి రావాలంటే కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. అందుకే వాళ్లు మా పార్టీలోకి రావడానికి తర్జనభర్జన పడుతున్నారు. బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న వాళ్లను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏ తప్పు అయితే చేసిందో కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు హస్తం గూటికి చేరగా.. పార్టీ మారేందుకు మరికొందరు నేతలు సిద్ధంగా ఉన్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం.జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్స్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు బండ్ల సాకేత్ రెడ్డితో కలిసి నిన్న శనివారం కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రాంరెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ సీఎం రేవంత్తో భేటీ అయినట్టు సమాచారం. మరో రెండు లేదా మూడు రోజుల్లో వీరిద్దరూ హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గద్వాల బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. ఎమ్మెల్యే వెంట అందరూ కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పీఎసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. -
weekly roundup: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్.. బీఆర్ఎస్లో గుబులు!
బీఆర్ఎస్ పార్టీకి గ్రహణం పట్టుకున్నట్లైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని చేజార్చుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సింగిల్ సీటు గెలవకుండా పట్టుకోల్పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కారు దిగుతూ హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. పార్టీ నేతలు అధికార పార్టీలోకి జంప్ చేయడం తలనొప్పిగా మారింది. మరోవైపు పార్టీని ఖాళీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఫిరయింపులను ముమ్మరం చేసుకుంటూ వెళ్తోంది. ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీనే.. ప్రోత్సహించడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత కే. కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ప్రజాప్రతినిధుల వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెసులో చేరగా, రాజ్య సభ సభ్యుడు కేకే పార్టీలో చేరిన మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్ లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని కాంగ్రస్ లోకి చేర్చుకున్నారు.కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భాను ప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్ , బొగ్గారపు దయానంద్, యెగ్గె మల్లేశం ఉన్నారు.తెలంగాణ శాసన మండలిలో సంఖ్యాపరంగా మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టుబింగించేదుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.ఈ క్రమంలో గురువారం ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. మండలిలో ఆ పార్టీ బలం 12 స్థానాలకు చేరింది. అయినా కీలకమైన బిల్లులు , తీర్మానాలను అవసరమైన సంఖ్యా బలం కాంగ్రెస్ కు లేదు.కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీలులేదు. ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీ ఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేస్తోంది. రానున్న కాలంలో మరికొంత మంది ఎమ్మెల్సీలను చేర్చుకునే కార్యక్రమాన్ని ప్రయత్నాలు కొనసాగిస్తోందని తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్థానాల బలం 29 నుంచి 21 కి పడిపోయింది.దీనికంటే ముందు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెల్సిందే. దీంతో మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో బీఆర్ఎస్ కు 21, కాంగ్రెస్ కు చేరినవారితో కలుపుకొని 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు.మరోవైపు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి గతంలో బీఆర్ఎస్ సన్నిహితంగా కొనసాగినా.. ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.కాగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఇక తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యే సమావేశానికి కార్పొరేటర్లు మినహా ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాధవరం కృష్ణా రావు, అరికేపూడి గాంధీ. కాలేరు వెంకటేష్,కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ లక్ష్మా రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి హాజరుకాలేదు. దీంతో వీరు పార్టీ మరుతున్నారా? అనే చర్చ కూడా మొదలైంది.మరోవైపు కొన్ని రోజులుగా పార్టీ మారనున్నారని ప్రచారం జరిగిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మరో 19 మంది కాంగ్రెస్ లో చేరితే.. బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయంతంగా కొనసాగుతోంది. మొత్తం బీఆర్ఎస్ గెలిచిన 38 సీట్లలో బండ్ల కృష్ణ మోహన్తో సహా ఏడుగురు కాంగ్రెస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం 31కి పడిపోయింది. పార్టీ మారటం లేదు..తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు అయోమయానికి గురి కావొద్దని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ స్పష్టం చేశారు.మరోవైపు గతంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆమె కుమారుడు, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను, తన తల్లి సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్లోనే కొనసాగుతామని కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కాంగ్రెసులో చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి మళ్లీ గెలించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు.బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ల ఆత్మీయ సమావేశంలో ఫిరాయింపుదారులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. '' పార్టీ నాయకులను సృష్టిస్తుంది.. నాయకులు పార్టీని సృష్టించరు. భవిష్యత్తులో సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తయారు చేస్తాం. అత్యున్నత పదవులు అనుభవించి పార్టీ మారాతున్నవారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు'' అని కేసీర్ అన్నారు. -
వాదనలు అనవసరం!
సాక్షి, హైదరాబాద్: ‘విభజన’ సమస్యలకు సంబంధించి వాదనలు అనవసరమని.. వివాదాల పరి ష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నా మని ఆంధ్రప్రదేశ్ సీఎస్, అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్టు తెలిసింది. వాదనలతో కాకుండా చర్చలతోనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నట్టు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబు, మంత్రులు, అధికారులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు తొలుత మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం తాను లేఖ రాసిన వెంటనే సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ముందుకు రావడం పట్ల రేవంత్రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు.కూర్చుని పరిష్కరించుకుందాం..ఎజెండాలో భాగంగా తొలుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను వివరించారు. 9, 10వ షెడ్యూళ్లలోని అంశాలు, తెలంగాణ పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ నీరబ్కుమార్ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశాన్ని ప్రస్తావించగా.. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకున్నారు. వివాదాల పరిష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాదనలు అనవసరమని స్పష్టం చేశారు. ఏదైనా కూర్చొని పరిష్కరించుకోవాలని రేవంత్తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఉద్యోగుల విభజన, ఏడు విలీన మండలాలు, భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల అంశం, టీటీడీలో, కోస్తా తీర ప్రాంతంలో వాటాలు, ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపకాలు మొదలైన అంశాలను ప్రస్తావించారు. చివరగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సీఎస్ల ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ, మంత్రుల ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునే విధంగా ప్రొటోకాల్ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.సాదర స్వాగతంతో.. మనసారా నవ్వుకుంటూ..ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్కు చేరుకోగా.. సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సాదరంగా స్వాగతం పలికారు. సమావేశ మందిరంలోకి వెళ్లిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబును సీఎం రేవంత్ శాలువాతో సత్కరించి.. కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. నంది జ్ఞాపికను అందజేశారు. తర్వాత చంద్రబాబు సీఎం రేవంత్కు శాలువా కప్పి సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన విందులో హైదరాబాదీ దమ్ బిర్యానీతోపాటు ఆమ్లెట్లు, చేపల కూర వంటి వంటకాలను వడ్డించారు. తిరిగి వెళ్లే సమయంలో రేవంత్, చంద్రబాబు ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. ఏదో అంశం ప్రస్తావనకు రాగా నవ్వుకుంటూ బయటికి వచ్చారు. -
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడితే ఊరుకోం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకోసం రాష్ట్ర ప్ర యోజనాల విషయంలో రాజీపడితే చూస్తూ ఊరుకో బోమని బీజేఎల్పినేత ఏలే టి మహేశ్వర్రెడ్డి హెచ్చరించారు. విభజన సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రుల భేటీని స్వాగతిస్తున్నామన్నారు. శనివా రం అసెంబ్లీ మీడియా హాల్ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పీకర్ ప్రసాద్కుమార్ అందుబాటులోకి రావడం లేదని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటే స్పీకర్ తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే ఈ అంశం హైకోర్టులో కేసు ఉందని, తాము అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. సర్కార్ పెద్దలు, వివిధ ట్యాక్సుల పేరుతో అవినీతికి పాల్పడిన తీరును తాను వాస్తవాలతో బయటపెట్టానని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే విచారణ జరుగుతుందని తెలిపారు. వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో.. గత ప్రభుత్వంలో సర్పంచులు లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించారని, కానీ, కేసీఆర్ సర్కారు ఆ పనులకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదని ఏలేటి చెప్పారు. ‘రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం ఒక్కో పంచాయతీలో రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయి ఉన్నట్లు సర్పంచులు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తమ్మీద రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉన్నట్లు సమాచారం. పది శాతం కమీషన్లు ఇస్తే తప్ప ఆర్ధిక శాఖ బిల్లులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వెయ్యి కోట్లకుపైగా ఉన్న పెండింగు బిల్లులను క్లియర్ చేసేందుకు పది శాతం కమిషన్ అంటే.. వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో’అని మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
విలువలు వల్లిస్తూ, ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒక వైపు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడుతూ, మరో వైపు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. గతంలో ఇతర పార్టీల నుంచి చేరికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చట్టబద్ధంగా వ్యవహరించిందన్నారు. రాజ్యాంగ నియమాలకు లోబడే ఆయా పార్టీల శాసనసభా పక్షాలు బీఆర్ఎస్లో విలీనమయ్యాయని వివరించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఓ వైపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్తూ.. కాంగ్రెస్ కండువాలు కప్పుతుండగా, రాహుల్గాంధీ మాత్రం రాజ్యాంగ విలువల గురించి నీతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ద్వంద్వ విధానాలకు రాహుల్ గాంధీ స్వస్తి పలికి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ నేతలు విన్యాసాలు చేస్తున్నారని నిరంజన్రెడ్డి అన్నారు. పార్లమెంటులో కాంగ్రెస్ ప్రాతినిధ్యం కేవలం 20 శాతం మాత్రమేనన్నారు. కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం 33 శాతం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు. దీనిని బట్టే బీఆర్ఎస్ పార్టీ ఉందో లేదో కాంగ్రెస్ నేతలే తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ఆగడాలను జాతీయ స్థాయిలో ప్రశ్నిస్తాం పార్లమెంటులో రాహుల్ రాజ్యాంగాన్ని చేత పట్టు కుని దానినే అపహాస్యం చేస్తున్నారని నిరంజన్రెడ్డి విమర్శించారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో శనివా రం రాహుల్ గాంధీకి నిరంజన్రెడ్డి లేఖ రాశారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేస్తామని ప్రకటించిన రాహుల్ .. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కరచాలనం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను జాతీయ స్థాయిలో ప్రశి్నస్తామని, రాహుల్ దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో రాహుల్ను బీజేపీ ఇక్కట్లకు గురిచేసిన సందర్భంలో పారీ్టలకు అతీతంగా తాము సానుభూతి చూపిన విషయాన్ని నిరంజన్రెడ్డి గుర్తు చేశారు. -
ఇక బీఆర్ఎస్ యువగళం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ, లోక్సభ ఎన్ని కల్లో వరుస ఓటముల నేపథ్యంలో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పార్టీ యంత్రాంగంలో యువతకు పెద్దపీట వేయాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి జిల్లాలవారీగా విశ్లేషణ చేపట్టిన గులాబీ దళం.. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ ఓడి పోవడంపై లోతుగా విశ్లేషణ జరిపింది. పార్టీ నాయకులు, కేడర్తోపాటు వివిధ సంస్థలు, వర్గాల నుంచి అందిన నివేదికలు, సమాచా రాన్ని క్రోడీకరించి బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కొందరు కీలక నేతలతో సారాంశాన్ని పంచుకున్నారు. దశాబ్దకాలంగా పార్టీ, పాలనాపరంగా దొర్లిన తప్పులు, పొరపాట్లకు సంబంధించి ఈ నివేదికల ద్వారా అనేక సూచనలు అందినట్లు సమా చారం. వాటితోపాటు తాజాగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇటీవల తాజా రాజకీయ పరిస్థితులను కూడా కేసీఆర్ మదింపు చేసి నట్లు సమాచారం. మరోవైపు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకొనే మార్పులు, బీఆర్ఎస్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే కోణంలోనూ కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో ఇప్పటికే లోతుగా చర్చించారు. పార్టీ ఆవి ర్భావం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు బీఆర్ఎస్ ప్రస్థానం, ఆ తర్వాత పదేళ్ల పాటు పాలన సాగించిన తీరుతెన్నులను విశ్లేషించి దిద్దుబాటు ప్రణాళికను కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం.దెబ్బతీసిన రాజకీయ పునరేకీకరణతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనా సంస్కరణలు, మౌలికవసతుల కల్పనపై దృష్టి కేంద్రీకరించడంతో విద్యా ర్థులు, యువత, ఉద్యోగ వర్గాలు దూరమైన ట్లుగా బీఆర్ఎస్ నిర్ధారణకు వచ్చింది. ప్రైవేటు రంగంలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జరిగినా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ ఉద్దేశపూర్వకంగా యువత, విద్యార్థులు ప్రేరేపించినట్లు గుర్తించింది. మరోవైపు కొన్ని సామాజికవర్గాలను కూడా బీఆర్ఎస్కు దూరం చేయడంలో ఈ రెండు పార్టీలు లోపాయికారీగా పనిచేశాయని పార్టీ నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నుంచి నేతల చేరిక బీఆర్ఎస్ బలోపేతానికి దోహదం చేయగా అధికారంలోకి వచ్చాక రాజకీయ పునరేకీకరణ పేరిట జరిగిన వలసలు పార్టీ క్షీణతకు దారితీసినట్లు నివేదికలు వెల్లడించాయి. అధికార పార్టీలో చేరి పదవులు, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలే ఆ తర్వాత బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలో క్రియాశీల పాత్ర పోషించారని నివేదించాయి. ఇతర పార్టీల నుంచి చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం, క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకపోవడం, ఎమ్మెల్యేలపైనే పార్టీ కార్యకలాపాలు పూర్తిగా ఆధారపడటం తదితర కారణాలతో పార్టీ దెబ్బతిన్నట్లు కేసీఆర్కు అందిన నివేదికలు వెల్లడించాయి. పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చడంతో ‘తెలంగాణ’ నినాదానికి దూరమైందని.. ఇతర రాష్ట్రాలపై దృష్టి పెంచడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను అవకాశాలను దెబ్బతీసిందని గుర్తించారు.అంతరాన్ని పూడ్చే ప్రయత్నాలురెండు దశాబ్దాలకుపైగా తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ ఇకపైనా అదే స్థాయిలో పనిచేసేలా చూడాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉద్యమకాలం నుంచి పార్టీతో కలిసి నడుస్తున్న వారికి కీలక బాధ్యతలు అప్పగించడంపై దృష్టి సారించారు. గతంలో పార్టీతో సన్నిహితంగా మెలిగి ప్రస్తుతం స్తబ్దుగా ఉంటున్న వారిని గుర్తించి తిరిగి వారిని క్రియాశీలం చేయాలనుకుంటున్నారు. ఉద్యమ సమయంలో వెంట నడిచిన ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలు, వివిధ సామాజికవర్గాలకు దగ్గరయ్యేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి. కీలక నేతలు కొందరు ఇప్పటికే ఆయా వర్గాలకు చెందిన వారితో సమావేశమై రాబోయే రోజుల్లో కలిసి పనిచేద్దామని ప్రతిపాదిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ తీరును ఎండగట్టిన కొందరు మేధావులు తాము ఇప్పటికిప్పుడే యూటర్న్ తీసుకొనే పరిస్థితి లేదంటూనే కొంత వ్యవధి కావాలని కోరుతున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ విధానాలతోనూ తాము సంతృప్తిగాలేమని చెబుతూ బీఆర్ఎస్తో కలిసి నడిచేందుకు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో భావసారూప్య వ్యక్తులు, సంస్థలతోనూ భేటీలు ముమ్మరం చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని కూడా వీలైనంత త్వరగా ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్రావు, ఇతర ముఖ్య నేతల నడుమ కూడా పని విభజన చేసి కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశముంది.యువతకు కీలక బాధ్యతలుపార్టీ సంస్థాగత నిర్మాణంలో యువతకు కీలక బాధ్యతలు అప్పగించడంతోపాటు వారిని క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో మమేకం చేయనున్నారు. గతంలో వివిధ కార్పొరేషన్లు, కమిషన్ల చైర్మన్లు, సభ్యులుగా పనిచేసిన యువ నాయకులను పార్టీ తరఫున జరిగే క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలపనున్నారు. బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కె.వాసుదేవరెడ్డి, ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాకేశ్రెడ్డి, శుభప్రద్ పటేల్, తుంగ బాలు, స్వామియాదవ్, ప్రవీణ్రెడ్డితోపాటు పలువురు యువ నేతలకు పార్టీ కమిటీల్లో చోటు కల్పించాలని నిర్ణయించారు. ఇప్పటికే నియోజకవర్గాలవారీగా నేతలు, కార్యకర్తలతో ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఆగస్టులో పార్టీ ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించే యోచనలో ఆయన ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా బీజేపీ, కాంగ్రెస్లు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో సోషల్ మీడియా విభాగాన్ని కూడా పటిష్టం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. -
కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా/సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చే రారు. శనివారం ఉదయం జూబ్లీహిల్స్లోని క్యాం పు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లాకు చెంది న మంత్రి జూపల్లి కృష్ణారావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యెన్నెం శ్రీనివాస్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఇలావుండగా సీఎం రేవంత్ త్వరలోనే గద్వాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభించనున్నారు. ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా అదే రోజు కృష్ణమోహన్రెడ్డి అనుచరులు, ముఖ్య కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని తెలిసింది. జెడ్పీ చైర్మన్కు సీఎం సముదాయింపు మరోవైపు బండ్ల చేరికను వ్యతిరేకిస్తూ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గీయులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఆమె సీఎం రేవంత్తో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా ఆమెను ముఖ్యమంత్రి సముదాయించినట్లు తెలిసింది. ఆ తర్వాతే బండ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. గద్వాల, ఆలంపూర్ మినహా మిగిలిన 12 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే హస్తం గూటికి చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ బలం 13కు పెరిగింది.నిధులు కేటాయించండిశ్రీధర్బాబుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతిఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలు సచివాలయంలో మంత్రిని కలిశారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వారు మంత్రిని కోరారు. అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు జిల్లా ఇన్చార్జి మంత్రిని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. -
రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ముందా?
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించే ప్రజాప్రతినిధులను అనర్హులను చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్’పేరిట కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సింది పోయి ఫిరాయింపులపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి పెట్టడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేత రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ చేశారు.పార్టీ ఫిరాయింపులు, అవినీతి, అక్రమాలు, హామీలు అమలు చేయకుండా మోసం చేసే విషయంలో కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు తేడా లేదని విమర్శించారు. బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘మోదీ సర్కార్ వచ్చాక గోకుల్ చాట్ పేలుళ్లు లేవు. లుంబిని పార్కు బాంబు బ్లాస్ట్లు లేవు. ఉగ్రవాదుల ఊచకోతలు లేవు. నక్సలైట్ల అర్ధరాత్రి హత్యలు లేవు. దేశం ప్రశాంతంగా ఉంది. దేశ భద్రత మా ప్రథమ కర్తవ్యం. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ ఏది? ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ వాళ్లకు మాత్రం ఉద్యోగాలు దొరికాయి. అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వని కాంగ్రెస్ సర్కార్.. మిగతా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తుందో చెప్పాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనందుకే లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని కాంగ్రెస్ అధిష్టానానికి డౌట్ వచ్చింది. అందుకే కురియన్ కమిటీ వచ్చి హమీల అమలుపై కసరత్తు చేస్తున్నట్టుంది. బీజేపీ ఎమ్మెల్యేల సెగ్మెంట్లకు నిధులివ్వరా? రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేయడం లేదు. నిధుల పంపిణీ బాధ్యతను అక్కడ ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులకు అప్పగించడం దుర్మార్గం. ఇది ప్రజాతీర్పును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. రాష్ట్రంలో కాంగ్రెస్ మాదిరిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తే.. వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి. రాజకీయాలకు, పారీ్టలకు అతీతంగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమాన ప్రాధాన్యత, నిధుల కేటాయింపు జరపాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి విభజన చట్టంలోని అంశాలపై రెండు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని స్వాగతిస్తున్నాం. అయితే చిత్తశుద్ధితో ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఇక కొందరు గోతికాడ నక్కలా సీఎంల భేటీని అడ్డుపెట్టుకుని మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వొద్దు. తెలంగాణ బిడ్డగా నా అభిప్రాయాలు నాకు ఉంటాయి. కానీ భారత ప్రభుత్వ ప్రతినిధిగా నేను రెండు రాష్ట్రాలను సమంగా చూడాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారానికి బాధ్యతతో కృషి చేస్తా. రేవంత్, ఒవైసీ కుమ్మక్కయ్యారు రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచి్చనా బీజేపీ గెలుపు ఖాయం. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజాసమస్యలను ప్రస్తావించిన బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం నేతల దాడి హేయమైన చర్య. సీఎం రేవంత్తో ఒవైసీ కుమ్కక్కై దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ తలచుకుంటే ఎంఐఎం నేతలు బయట తిరగలేరు..’’అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.కేకే ఒక్కడితోనే ఎలా రాజీనామా చేయిస్తారు?కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ రాజ్యసభ స భ్యుడు కె.కేశవరావు ఒక్కరితోనే ఎట్లా రాజీనామా చేయిస్తారు? నిజంగా కాంగ్రెస్ ప్రజా పాలన మీద అంత నమ్మకం ఉంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. కాంగ్రెస్లోకి 26 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వారందరితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళితే.. ఆ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. బీజేపీలోకి రావాలనుకునే ఎమ్మెల్యేలెవరైనా రాజీనామా చేసి చేరాల్సిందే. గతంలో హుజూరాబాద్, మును గోడు ఎమ్మెల్యేలు రాజీనామా చేశాకే బీజేపీలో చేరారు. -
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకే
సాక్షి, హైదరాబాద్: ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కే.కేశవరావు(కే.కే) తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ అఫైర్స్)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం జీవో జారీచేసింది. కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది.బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా, కేసీఆర్కు సన్నిహితుడైన కె. కేశవరావు బుధవారం ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయన తన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే తాను కూడా కాంగ్రెస్లో చేరనున్నట్లు ప్రకటించారు. కాగా.. అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్లో బుధవారం చేరారు. కేకే.. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పార్టీ మారిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.కాగా, తెలంగాణలో చేరికలో విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం పార్టీలో చేరిపోయారు. దీంతో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యల 38 నుంచి 31కి పడిపోయింది. అయితే, మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్టు సమాచారం. వారు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక, మరో 19 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతల అధికార పార్టీలోకి జంప్ అవుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరిపోయారు. అటు ఎమ్మెల్సీలు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. దీంతో, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. -
బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం సభ్యుల దాడి.. జీహెచ్ఎంసీ నిరవధిక వాయిదా
Updates..👉గలాట మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ నిరవధిక వాయిదా.👉కౌన్సిల్లో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల గొడవ.👉బీజేపీ కార్పొరేటర్లపై ఎంఐఎం కార్పొరేటర్ల దాడి. 👉అధికారులు భాధ్యత తీసుకోవడం లేదు: బీజేపీ కార్పొరేటర్లు అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.డిపార్ట్మెంట్ హెచ్ఓడీ కౌన్సిల్కు రాకుండా కింది ర్యాంక్ అధికారులను పంపుతున్నారు.ఎన్ని సార్లు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదు వాటర్ బోర్డు ఎండీ కౌన్సిల్ సమావేశానికి రాకపోవడంపై బీజేపీ ఆందోళన మేయర్ పోడియం వద్ద బీజేపీ నిరసన వచ్చే జనరల్ బాడి సమావేశానికి ఎండీ రావాలని మేయర్ ఆదేశం 👉ప్రాపర్టీ టాక్స్ టార్గెట్ పెంచాలని జీహెచ్ఎంసీ ఆలోచన👉జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న డ్రోన్ సర్వే👉రెండు వారాల్లో ఇంటింటి సర్వే స్టార్ట్ అవుతుంది: స్నేహ షేబరిష్👉రంగనాథ్ ఐపీఎస్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్👉వాటర్ లాగింగ్పై ఈవీడీఎం కసరత్తు చేసింది. సమస్యలు లేకుండా చూస్తాం👉హైడ్రా పరిధి జీహెచ్ఎంసీ నుంచి హెచ్ఎండీఏ వరకు పెంచనున్నారు👉డిజాస్టర్ రెస్పాన్స్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది👉ప్రజలు, ప్రజాప్రతినిధులు రాబోయే రోజుల్లో ఈవీడీఎం, హైడ్రాకు సహకరించాలి కౌన్సిల్ కాసేపు వాయిదా.. 👉మరోసారి మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు👉మేయర్ పోడియం వద్దకు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు👉బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసనకు కౌంటర్ నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు👉మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన వల్ల మరోసారి సభ వాయిదా👉15 నిమిషాల పాటు వాయిదా వేసిన మేయర్.👉మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కామెంట్స్..ఇప్పుడు హైదరాబాద్లో చాలా సమస్యలు ఉన్నాయి.వర్షాకాలం కావడంతో సమస్యల పరిష్కారం కోసం ఫైట్ చేయాలి.ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.నాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేయర్ ఛాంబర్ ముందు ధర్నా చేయవచ్చు.సభలో ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి.మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలి అనడం కరెక్ట్ కాదు.👉ఎన్నికల కోడ్కు ముందే రోడ్ల మరమ్మత్తుల కోసం బడ్జెట్ కేటాయింపు జరిగింది- బీఆర్ఎస్ కార్పొరేటర్లు👉నిధులు కేటాయింపు జరిగినా ఎందుకు విడుదల చేయలేదు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ కావాలని అధికారులు అంటున్నారు.👉అధికారులు కార్పొరేటర్లను పట్టించుకోవడం లేదు.👉కౌన్సిల్ సమావేశానికి పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డుమ్మా..👉కౌన్సిల్ భేటీకి డుమ్మా కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి👉కౌన్సిల్ భేటీకి కచ్చితంగా హాజరుకావాలని అధిష్ఠానం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశం👉అధిష్ఠానం ఆదేశించినా హాజరు కానీ ఎమ్మెల్యేలు👉కార్పొరేటర్ చనిపోతే ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి - బీజేపీ కార్పొరేటర్ నరసింహ రెడ్డి👉మన్సూరాబాద్ కార్పొరేటర్ మరణించి ఏడాది గడుస్తున్నా ఎన్నికలు జరపలేదు. 👉లాస్య నదింత మృతిపై కౌన్సిల్లో సంతాపం.👉లాస్య నందిత మరణం బాధాకరం.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు👉ఆమె అకాల మరాణానికి సంతాపం తెలియజేస్తున్నాం👉లాస్య నందిత మరణం ఎంతో బాధకలిగించింది: బీజేపీ కార్పొరేటర్లు👉సాయన్న కుతురుగా లాస్య నందిత మంచి పేరును ప్రజల్లో తెచ్చుకున్నారుజ👉లాస్య నందిత మరణం బాధాకరం: ఎంఐఎం కార్పొరేటర్లు👉ఆమె పనితిరుతో ప్రజల మెప్పు పొందారు.👉అభివృద్ధి చేయలేక.. చేతకాక మేయర్ పార్టీ మారింది: బీజేపీ ఎల్పీ లీడర్ శంకర్ యాదవ్👉మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన👉మేయర్ కామెంట్స్.. 👉సంతాపం పెడదామని మేయర్ చెప్పినా వినిపించుకొని బీఆర్స్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు👉ఆరు నెలల నుంచి జీహెచ్ఎంసీలో ఏమైనా పనులు అయ్యాయా? -మేయర్.👉అభివృద్ధిపై సభలో చర్చ జరగాలి.👉అన్ని పార్టీల నేతలు చర్చకు సహకరించాలి.👉అభివృద్ధిపై మేయర్ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు.👉అభివృద్ధి చేసేది మేయర్ కాదా అని ప్రశ్నించి బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన.👉కార్పొరేటర్లు మేయర్ చైర్కు మర్యాద ఇవ్వాలన్న మేయర్. 👉 కౌన్సిల్లో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం. 👉 బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం. 👉మేయర్ పోడియం ముందుకు వెళ్ళిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు. 👉పార్టీల ఫిరాయింపులపై బీఆర్ఎస్ నాయకుల నిరసన👉ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీనే- మేయర్👉బీఆర్ఎస్ నేతలకు ఫిరాయింపులపై మాట్లాడే హక్కు లేదు - మేయర్👉అభివృద్ధిని అడ్డుకోవడమే బీఆర్ఎస్ టార్గెట్.👉బీఆర్ఎస్ నేతల వద్ద సబ్జెక్టు లేదు.👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో జామర్స్ పెట్టిన అధికారులు👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ 15 నిమిషాల పాటు వాయిదా👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ సహా బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం.. 👉బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను నెట్టివేసిన ఎంఐఎం కార్పొరేటర్లు.👉రాజ్యాంగం బుక్ తో కౌన్సిల్లోకి వచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్ ఫస్టుద్దీన్.👉పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ రాజ్యాంగం బుక్ తో రావడం ఏంటని ప్రశ్నించిన బీజేపీ👉జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. 👉జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ కార్పొరేటర్ల నిరసన.👉డ్రైనేజీ నగరం హైదరాబాద్ అంటూ నిరసన చేస్తున్న కార్పొరేటర్లు.👉నాలాల కూడికతీత, మాన్ హోల్స్ సేఫ్టీ ఏర్పాటు చేయాలని డిమాండ్.👉జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరగనుంది. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్ని పార్టీలకు సంబంధించి 23 ప్రశ్నలతో సుదీర్ఘంగా చర్చ సాగేలా సభ సన్నద్ధమైంది. అయితే, ఈ సభ ప్రత్యేకతను సంతరించుకున్నది. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.👉ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ మారిన మేయర్ రాజీనామా డిమాండ్, అభివృద్ధి, ఆరు గ్యారంటీల అమలు ఎజెండాగా బీఆర్ఎస్ ముక్త కంఠంతో ప్రశ్నించేందుకు సిద్ధమైంది.అధికార పార్టీ కంటే బలంగా ఉన్న ప్రతిపక్షాలు..👉గడిచిన కొన్ని నెలలుగా జంపింగ్ జపాంగ్లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులతో నేటికీ బీఆర్ఎస్ మాత్రమే బలంగా ఉంది. 150 మంది కార్పొరేటర్లలో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా కాగా, మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47 మందితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. -
జగిత్యాల కాంగ్రెస్లో కొత్త చర్చ.. జీవన్రెడ్డి ఫొటో ఎక్కడ?
సాక్షి, జగిత్యాల: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష పార్టీల నేతలు హస్తం గూటికి చేరుతున్న నేపథ్యంలో పలు చోట్ల కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఫ్లెక్సీల వార్ ఇంకా కొనసాగుతోంది.తాజాగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫొటోలు లేకపోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయ్యింది. కావాలనే జీవన్ రెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. ఇక.. మొన్న కూడా జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించిన విషయం తెలిసిందే.మరోవైపు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య సయోధ్య కుదరడం లేదు. దీంతో, రెండు వర్గాల మధ్య దూరం పెరుగుతోంది. ఈనేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్లో అంతర్గత పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. జగిత్యాలలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డిని కావాలనే సైడ్ చేస్తున్నారా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
కేసీఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క లీగల్ నోటీసులు పంపించారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నందుకు రూ.100 కోట్ల మేరకు నష్టపరిహారంగా చెల్లించాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి ఆమె ఈ నోటీసులు పంపించారు. ‘ఇందిరమ్మ రాజ్యంలో– ఇసుకాసుర రాజ్యం’అంటూ సీఎం, సీతక్కతో పాటు మంత్రులపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి తీవ్రంగా పరిగణించారు.సామాజిక మాధ్యమాల్లో తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఆ మేరకు అరోపణల వీడియో అసత్యమని అంగీకరిస్తూ ఒక వీడియో పోస్ట్ చేయాలని ఆ నోటీసుల్లో మంత్రి పేర్కొన్నారు. ఈ నోటీసులకు స్పందించి క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 24న బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టిన నేపథ్యంలో లీగల్ నోటీసులు పంపించినట్టు మంత్రి తరఫు న్యాయవాది నాగులూరు కృష్ణకుమార్ తెలిపారు. ఈ మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోలో సీతక్కతో సీఎం, కేబినెట్ మంత్రులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినట్టుగా చూపడాన్ని తప్పు బట్టారు. పనిగట్టుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా అవాస్తవాలతో చేస్తున్న దు్రష్పచారంతో తమ క్లయింట్, మంత్రి సీతక్క ప్రతిష్టకు తీరని విఘాతంతోపాటు, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గం ఓటర్లలో ఆమెకున్న ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన అభ్యంతరం వ్యక్తంచేశారు. -
బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం ఎటూ తేలలేదు. దీంతో పార్టీ నాయ కులు, కార్యకర్తల్లో స్తబ్దత నెలకొంది. కేంద్ర కేబినెట్ ఏర్పాటు, తదనంతర పరిణామాల్లో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తెరపైకి వచ్చి హడావిడి జరిగినా, ఆ తర్వాత మళ్లీ సద్దుమణిగింది. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డిని జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జ్గా నియమించారు. దీంతో ఆయన అటు మంత్రిగా పార్లమెంట్ సమావేశాలు, కశ్మీర్ బాధ్యతలతో బిజీగా ఉంటున్నారు. కశ్మీర్ ఎన్నికలు వచ్చే సెపె్టంబర్ నెలాఖరులోగా జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి దాకా అధ్యక్షుడి గా ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించే పరిస్థితులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అ యితే ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దా నిపై బీజేపీ కేంద్రం నాయకత్వం ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రాలేదు. దీంతో ఈ అంశం కొంతకాలం పాటు పెండింగ్లో పడినట్టుగానే భావించాల్సి ఉంటుందని పారీ్టవర్గాలు పేర్కొంటున్నా యి. రాష్ట్రంలో అడపాదడపా యువమోర్చా, మహిళా మోర్చా ల వంటి విభాగాలు ఆయా అంశాలు, సమస్యలపై నిరసనలు, దీక్షలు వంటివి చేపడుతున్నా పెద్దనాయకులెవరూ పాల్గొనకపోవడంతో అవి పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి.అ«ధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్యనేతలు పోటీపడుతున్నా, చివరకు ఎవరిని నియమిస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. పారీ్టలో ఉన్న ఇప్పటికే ఉన్న కొందరు ముఖ్యనేతలు, పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయలేమి, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పవర్సెంటర్లుగా మారడం వంటి కారణాలతో పారీ్టనాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికను వాయిదా వేస్తోందని పారీ్టనాయకులు భావిస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసి, ఆయన్ను కూడా కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నందున, కొత్త జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశాలున్నాయని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.కొనసాగుతున్న ఉత్కంఠ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర బీజేపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అర్వింద్ ధర్మపురి, ఎం.రఘునందన్రావు గట్టిగా పోటీపడుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. కేంద్రమంత్రిగా, బీజేఎలీ్పనేతగా రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచి్చనందున, బీసీ వర్గాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. దీంతో ఈటల పేరు దాదాపుగా ఖరారై ప్రకటించాల్సిన దశలో మళ్లీ ఏవో కారణాలతో వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి ఒకరి ఎంపిక ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడుతున్నారు. పారీ్టపరంగా చూస్తే ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్సీ ఎ¯న్.రామచంద్రరావు, టి.ఆచారి, ఎం.ధర్మారావు డా.జి. మనోహర్రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, దుగ్యాల ప్రదీప్కుమార్, కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.అధ్యక్ష పదవి కోసం పాత,కొత్త నాయకుల మధ్య తీవ్రస్థాయిలో పోటీ నెలకొనడంతో రాష్ట్ర పారీ్టలోనూ విచిత్ర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొంతకాలం క్రితమే పారీ్టలో చేరిన వారికి కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ కూడా బలంగానే వినిపిస్తోంది. మరోవైపు 1951లో జనసంఘ్ కాలం, 1980లో బీజేపీగా ఏర్పడ్డాక ఇప్పటిదాకా రెండేళ్ల పాటు మాత్రమే బంగారు లక్ష్మణ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించారు. ఇదీగాకుండా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో దళిత సామాజికవర్గాల ఆదరణను పొందలేకపోయినందున ఈసారి ఓ సీనియర్ ఎస్సీ నేతను కొత్త అధ్యక్షుడిగా నియమించడం ద్వారా ఈ వర్గాల్లోనూ పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుందని ఓ వర్గం నాయకులు గట్టిగా వాదిస్తున్నారు. -
విద్యార్థి నేతలపై పోలీసుల అణచివేత
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులపై పోలీసుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రయత్నం చేసిన యువకులు, నిరుద్యోగులను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఒక ప్రకటనలో తప్పుపట్టారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరుద్యోగులతో రాహుల్గాంధీ ములాఖత్లు జరిపారని, కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచి్చన తర్వాత అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు.ఎన్నికలకు ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి, నిరుద్యోగులను కాంగ్రెస్ వాడుకుందని చెప్పారు. కానీ ప్రస్తుతం వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. ప్రజాపాలన అంటూ పదేపదే చెబుతూ..నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వకుండా నియంతృత్వంతో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన జాబ్ కేలండర్ తేదీల గడువు ఇప్పటికే తీరిపోయిందని తెలిపారు. నిరుద్యోగులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించేంతవరకు వదలం: హరీశ్రావు నిరుద్యోగుల సమస్యల పరిష్కారంతోపాటు డిమాండ్లు సాధించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల తరఫున గొంతెత్తి నిరంతర పోరాటం చేస్తామన్నారు. టీజీపీఎస్సీ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘ నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు. శాంతియుత నిరసన తెలిపేందుకు వెళ్లిన వారిని నిర్బంధించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు జరిగే అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తుతుందని హరీశ్రావు స్పష్టం చేశారు.అరెస్టులపై బీఆర్ఎస్ ఖండనఏడు నెలలుగా నిరుద్యోగ సమస్యలను రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కాంగ్రెస్పాలనలో అప్రకటిత ఎమర్జన్సీ అమలవుతోందని నిరంజన్రెడ్డి అన్నారు. నిరుద్యోగుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం తరపున ఎవరూ అందుబాటులో లేరని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. -
నేడు రేవంత్, బాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై శనివా రం సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్ధన్రెడ్డి, కందుల దుర్గే‹Ù, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇతర శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొననున్నారు. కీలక అంశాలపై చర్చలు విభజన సమస్యలపై గతంలో అధికారుల స్థాయిలో దాదాపు 30 సమావేశాలు జరిగినా పెద్దగా ముందడుగు పడలేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీఠ వేయడంతో సమస్యలు, అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. తాజా సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10లోని సంస్థలు, వాటి ఆస్తులు, నగదు నిల్వల పంపకాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది.ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలా కుదరదని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వేలకోట్లతో హైదరాబాద్లో ఆస్తులు ఏర్పడ్డాయని, వాటిలో వాటా కావాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ మాత్రం తమ భూభాగంలోని స్ధిరాస్తుల్లో వాటా ఇచ్చే ప్రసక్తే లేదని వాదిస్తోంది. ఇక ఆర్టీసీ బస్భవన్, రాష్ట్ర ఆర్థికసంస్థ, ఉన్నత విద్యా మండలి, స్పోర్ట్స్ అథారిటీ ఆస్తులు, దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్, ఉద్యోగుల పరస్పరం బదిలీ అంశాలు కూడా ప్రస్తుత భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. విద్యుత్ బకాయిల అంశం కూడా.. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశం కూడా ప్రధానంగా మారింది. తెలంగాణకు రావాల్సిన సీలేరును ఏపీకి కేటాయించడం వల్ల, అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేయడం వల్ల.. వేల కోట్ల రూపాయల భారం రాష్ట్రంపై పడిందని, ఆ మొత్తాన్ని ఏపీ చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే.. తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున అందుకు చెల్లించాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఏపీ చెబుతోంది.దీనితో పాటు కృష్ణా జలాల పంపకంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. గతంలో తాత్కాలిక పద్ధతిలో పంపిణీ చేసిన కృష్ణా జలాలను ఇప్పుడు 50 :50 చొప్పున పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. మరోవైపు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు చెందిన నిధుల వివాదం కూడా పరిష్కారానికి నోచుకోలేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ డిమాండ్లు 1.రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి. 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1000 కి.మీ మేర విస్తారమైన తీరప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలి. 3. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుపతి వేంకటేశ్వరస్వామి. టీటీడీలో కూడా తెలంగాణకు భాగం కావాలి. 4. కృష్ణా నదిలో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్ మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలి. 5. తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు రూ.24 వేల కోట్ల బకాయిలు సత్వరమే చెల్లించాలి. దానిలో భాగంగా ఆంధ్రాకు ఏమైనా చెల్లించాల్సి ఉంటే చెల్లించడం జరుగుతుంది. 6. తెలంగాణకు ఓడరేవులు లేవు. అందువల్ల విభజనలో భాగంగా ఆంధ్రాలోని కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం రేవుల్లో వాటా కావాలి. -
తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారిగా సుదర్శన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈవో వికాస్రాజ్ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. నూతన సీఈవోగా నియమితులైన సుదర్శన్రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు.కాగా, తెలంగాణలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు వికాస్ రాజ్ నిర్వహించగా, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వికాస్ రాజ్ను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో సుదర్శన్ రెడ్డిని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారిగా ఈసీ నియమించింది.