ఏనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత | tdp deeksha in enumamula market | Sakshi
Sakshi News home page

ఏనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత

Feb 20 2017 3:57 PM | Updated on Aug 21 2018 5:51 PM

వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వరంగల్ అర్బన్: వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిర్చికి రూ.10 వేలు, కందులకు రూ.8 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీడీపీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన దీక్ష టెంట్లను తొలగించివేశారు. అయినప్పటికీ తాము దీక్ష చేపట్టి తీరుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో మార్కెట్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement