ఏపీకి వర‍్షసూచన

ఏపీకి వర‍్షసూచన - Sakshi

విశాఖ: దక్షిణ అండమాన్‌, దానికి ఆనుకుని ఉన్న మలయా ద్వీపకల్పం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఈ నెల 15 కల్లా దక్షిణ అండమాన్‌ సముద్రం, నికోబార్‌ దీవులతోపాటు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములతో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, కోస్తాలో అక్కడక్కడా ఈదరుగాలులు, పిడుగులు సంభవించే అవకాశం వుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top