‘హరహర మహాదేవ. | mahasivaratri festival | Sakshi
Sakshi News home page

‘హరహర మహాదేవ.

Mar 1 2014 1:35 AM | Updated on Oct 8 2018 7:04 PM

‘హరహర మహాదేవ. - Sakshi

‘హరహర మహాదేవ.

శంభో శంకర’ అంటూ రాష్ట్రంలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. భక్త జనం తరలి రావడంతో శివాలయాలు భక్తి పారవశ్యంలో మునిగాయి. గురువారం సాయంత్రం నుంచి మహాశివరాత్రి వేడుకలు శివాలయూల్లో వైభవంగా సాగుతున్నారుు.

 శంభో శంకర’ అంటూ రాష్ట్రంలోని శైవక్షేత్రాలు మార్మోగాయి. భక్త జనం తరలి రావడంతో శివాలయాలు భక్తి పారవశ్యంలో మునిగాయి. గురువారం సాయంత్రం నుంచి మహాశివరాత్రి వేడుకలు శివాలయూల్లో వైభవంగా సాగుతున్నారుు.
 

 


 మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలోని శివాలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజాధికార్యక్రమాలు జరిగాయి. శివ భక్తులు తమ తమ ఇళ్లల్లో ఉదయాన్నే తల స్నానం ఆచరించి పూజలు నిర్వహించారు. ఉపవాస దీక్షతో శివ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్త్రోత్త్రం, శివ సహ స్ర నామ పారాయణం పఠించారు. ఇక సాయం సంధ్య వేళ శివాలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.

 

 శంభో శంకర: రాష్ట్రంలోని రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి ఆలయం, కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయం, మదురైలోని మీనాక్షి సోమ సుందరేశ్వర ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం, చిదంబరం నటరాజ స్వామి ఆలయం, కుట్రాలంలోని కుట్రాలనాథేశ్వరర్ ఆలయం, కోయంబత్తూరులోని పొల్లాచ్చి సుందరేశ్వరాలయం, కన్యాకుమారిలోని ధనుమలయాన్ ఆలయం, కరూర్ జిల్లాలోని ఏకపురీశ్వరర్ ఆలయం... ఇలా రాష్ట్రంలోని అన్ని  ప్రధాన శివ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి శివరాత్రి వేడుకల్లో పాల్గొని తరించారు. చెన్నై మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయం, తీర్థ స్వామీశ్వర ఆలయం, వాలీశ్వర ఆలయం, తిరువాన్మీయూరు మరుదీశ్వర ఆలయం, వేళచ్చేరి శ్రీ దండీశ్వర ఆల యం, తిరువేర్కాడు వీరకత్తీశ్వర ఆలయం, వలసరవాక్కం వేల్వీశ్వరాలయం, పూందమల్లి వైదీశ్వరాలయం, పార్క్‌టౌన్‌లోని ఏకాంబరీశ్వరాలయం, వడపళణి వేంగీశ్వరాలయం, సైదాపేట కారనీశ్వరాలయం, మింట్ దక్షిణామూర్తి ఆలయం, అనకాపుత్తూరులోని అగదీశ్వరాలయం, పాడిలోని వలిదీశ్వర ఆలయం, కోయంబేడులోని కురుందీశ్వరాలయం తదితర శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి.

 

 పూజలు : అన్ని శైవ క్షేత్రాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మొదటి విడత, తొమ్మిది నుంచి పన్నెండు వరకు రెండో విడత పూజ, పన్నెండు నుంచి శుక్రవారం ఉదయం మూడు గంటల వరకు మూడో విడత, మూడు నుంచి నాలుగు గంటల వరకు నాలుగో విడత చొప్పున నాలుగు కాల పూజలు భక్తి భావాన్ని పెంపొందిస్తూ నిర్వహించారు.  శివుడు, పార్వతీ దేవి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. వాహనాల్లో స్వామి, అమ్మవార్లను అధిష్టించి  ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ ఆవరణల్లో శివరాత్రి పరమార్థాన్ని వివరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో ఆలయాల్లో శివ లింగాన్ని దర్శించుకున్న భక్తులు రాత్రంతా జాగారం చేశారు.  

 

 జ్యోతిర్లింగాల దర్శనం: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న శైవ క్షేత్రాల్లో పూజలందుకుంటున్న జ్యోతిర్లింగాల్ని బ్రహ్మకుమారి సమాజం చెన్నైలో కొలువు దీర్చింది. పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఏర్పాట్లు చేశారు. బ్రహ్మకుమారి సమాజం, ఐశ్వర్య విశ్వ విద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు ఆరంభం అయ్యాయి. పురసైవాక్కం రాజా అన్నామలై రోడ్డులోని ధర్మ ప్రకాష్ కల్యాణ మండపం వేదికగా పన్నెండు జ్యోతిర్లింగాలను కొలువుదీర్చారు. శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జ్యోతిర్లింగాలను భక్తులు దర్శించవచ్చు.

 

 సంగీత విభావరి: శివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులతో పన్నెండు గంటల సంగీత విభావరి జరిగింది. కర్నాటక సంగీత విద్వాంసులు టీఎన్ కృష్ణన్, సుగుణావరదాచారి, నైవేల శాంతన గోపాలన్, గాయత్రి వెంకటరాఘవన్ తదితరులు శివ భక్తి గీతాలాపనలతో భక్తి భావాన్ని చాటారు. నగరంలోని మైలాపూర్ లజ్ కార్నర్ సమీపంలోని ఆర్‌కే కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ సంగీత విభావరి సాయంత్రం ఆరు గంటల నుంచి నిర్విరామంగా పన్నెండు గంటల పాటు సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement