కాపురానికి రానంది అంతే... | husband attacks wife in tamilnadu | Sakshi
Sakshi News home page

కాపురానికి రానంది అంతే...

Mar 16 2016 8:41 AM | Updated on Jul 27 2018 2:18 PM

కాపురానికి రానంది అంతే... - Sakshi

కాపురానికి రానంది అంతే...

కాపురానికి రావడం ఇష్టం లేదని భార్య చెప్పడంతో ఆగ్రహించిన భర్త ఆమె చెవి కోసి పారిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

చెన్నై : కాపురానికి రావడం ఇష్టం లేదని భార్య చెప్పడంతో ఆగ్రహించిన భర్త ఆమె చెవి కోసి పారిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆవడి సమీపంలో బంగారం పేట కరుమారియమ్మన్ కోవిల్ వీధికి చెందిన మారియప్పన్ (37). ఇతడు గోమాంసం దుకాణం నడుపుతున్నాడు. ఇతని భార్య మాలతి (24). వీరికి ఇద్దరు పిల్లలు.

సోమవారం సాయంత్రం దంపతుల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. దీంతో మాలతి కోపంతో ఆమె తల్లి అములు పనిచేసే గార్డన్‌కు వెళ్లింది. విషయం తెలిసి మారియప్పన్ అర్ధరాత్రి 12 గంటలకు గార్డెన్‌కు వెళ్లాడు. మాలతిని తనతో పాటు ఇంటికి రమ్మని పిలిచాడు. అయితే మాలతి అంగీకరించలేదు. మారియప్పన్‌తో గొడవకు దిగింది.

ఆగ్రహించిన మారియప్పన్ కత్తితో మాలతి కుడి చెవి కోసి పరారయ్యాడు. ఈ దాడిలో గాయపడిన మాలతిని ఆమె బంధువులు కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు ఆవడి ట్యాంక్ ఫ్యాక్టరీ పోలీసులు పరారీలో ఉన్న మారియప్పన్‌ను మంగళవారం అరెస్టు చేశారు. అతడిని అంబత్తూరు కోర్టులో హాజరు పరచి పుళల్ జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement