జీజీహెచ్ లో వైద్యుల ధర్నా | Sakshi
Sakshi News home page

జీజీహెచ్ లో వైద్యుల ధర్నా

Published Thu, Sep 15 2016 11:14 AM

జీజీహెచ్ లో వైద్యుల ధర్నా - Sakshi

గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు గురువారం ధర్నాకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఓ పసిబిడ్డ మృతిచెందాడని ఆరోపణలు రావడంతో నలుగురు డాక్టర్లపై మంత్రి కామినేని శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఎలాంటి తప్పు లేకపోయినా సస్పెన్షన్ చేశారంటూ గుంటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులంతా సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరిండెంట్ వారితో చర్చలు జరుపుతున్నారు. డాక్టర్ల ఆందోళనతో వైద్య సేవలు నిలిచిపోయాయి.

Advertisement
Advertisement