శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న దేవినేని ఉమ
Oct 16 2016 8:14 AM | Updated on Aug 21 2018 8:34 PM
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్న ఆయన పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించిన డిజైన్లను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..2018 లోగా పోలవరం ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని.. ప్రస్తుతం ప్రాజెక్ట్కు సంబంధించిన పనులు వేగవంతంగా జరగుతున్నాయని అన్నారు. మంత్రికి టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
Advertisement


