జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి బొగ్గుగనిలో పెను ప్రమాదం తప్పింది.
సింగరేణిలో తప్పిన పెను ముప్పు
Nov 26 2016 10:43 AM | Updated on Apr 3 2019 7:53 PM
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి బొగ్గుగనిలో పెను ప్రమాదం తప్పింది. ఆరవ గనిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో.. పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. గనిలోని రెండవ సీమ్ 15 ఎఫ్ లెవల్లో ఒక్కసారిగి మంటలు చెలరేగి దట్టమైన పొగలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement