కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి | 4 children died after fall in pond in rangareddy district | Sakshi
Sakshi News home page

కుంటలో పడి నలుగురు చిన్నారుల మృతి

Sep 15 2016 1:44 PM | Updated on Sep 17 2018 8:02 PM

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది.

కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మహ్మద్‌నగర్ పక్కన ఉన్న కుంటలో ప్రమాదవశాత్తూ పడి నలుగురు పిల్లలు మృతి చెందారు. కుంటలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. వీరంతా మహ్మద్‌నగర్‌కు చెందిన శిల్ప(14), శివ(13), సుజన్(13), బన్నీ(10)లుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సంఘటనాస్థలంలో రోదనలు మిన్నంటుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement