దక్షిణాఫ్రికా గెలుపు
డర్బన్: పాకిస్తాన్తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాకిస్తాన్ 45.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. హసన్ అలీ (45 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్స్లు), సర్ఫరాజ్ అహ్మద్ (41; 2 ఫోర్లు) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫెలుక్వాయో (4/22) ఆకట్టుకున్నాడు. అనంతరం దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసి విజయం సాధించింది.
వాన్ డెర్ డసెన్ (80 నాటౌట్; 9 ఫోర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫెలుక్వాయో (69 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. వీరిద్దరు ఆరో వికెట్కు అజేయంగా 127 పరుగులు జోడించారు. ఈ ఫలితంతో ఐదు వన్డేల సిరీస్లో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. మూడో వన్డే సెంచూరియన్ పార్క్లో శుక్రవారం జరుగుతుంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు