ఫీల్డింగ్‌ ఎంచుకున్న టీమిండియా

India Won the Toss and Decided to Bowl First - Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యం కావడంలో ఆటను 43 ఓవర్లకు కుదిరించారు. కేఎల్‌ రాహుల్‌కు తుది జ​ట్టులో చోటు దక్కలేదు. శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, కుల్దీప్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు. 299 వన్డే ఆడుతున్న విధ్వంసక బ్యాట్స్‌మన్‌ క్రిస్‌ గేల్‌ విండీస్‌ తరుపున అత్యధిక​ వన్డేలు ఆడిన బ్రియన్‌ లారా రి​కార్డును సమం చేశాడు.

జట్లు
భారత్‌: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌

వెస్టిండీస్‌: జాసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, ఎల్విన్‌ లూయిస్‌, షాయ్‌ హోప్‌, హేట్‌మేయర్‌, నికోలస్‌ పూరన్‌, రోస్టన్‌ చేజ్‌, ఫాబియన్‌ అలెన్‌, కార్లొస్‌ బ్రాత్‌వైట్‌, కీమర్‌ రోచ్‌, షెల్డన్‌ కాట్రేల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top