యువ భారత్‌ శుభారంభం | India Under 19 Won By 90 Runs Against Sri Lanka | Sakshi
Sakshi News home page

యువ భారత్‌ శుభారంభం

Jan 20 2020 3:10 AM | Updated on Jan 20 2020 3:10 AM

India Under 19 Won By 90 Runs Against Sri Lanka - Sakshi

బ్లోమ్‌ఫొంటెన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అండర్‌–19 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో యువ భారత్‌ 90 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిరీ్ణత 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (59; 8 ఫోర్లు), హైదరాబాద్‌ ప్లేయర్‌ ఠాకూర్‌ తిలక్‌వర్మ (46; 3 ఫోర్లు), కెపె్టన్‌ ప్రియమ్‌ గార్గ్‌ (56; 2 ఫోర్లు) రాణించి భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా...చివర్లో ధ్రువ్‌ జురెల్‌ (48 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిద్ధేశ్‌ వీర్‌ (27 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 45.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. నిపున్‌  పెరీరా (50; 2 ఫోర్లు, సిక్స్‌), రవీందు (49; 5 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్‌ సింగ్, సిద్ధేశ్‌ వీర్, రవి బిష్ణోయ్‌ రెండేసి వికెట్లు తీశారు. మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement