టీమిండియా భారీ గెలుపు

India Beat West Indies by 257 Runs in Second Test - Sakshi

కింగ్‌స్టన్‌ (జమైకా): వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా గెలిచింది. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ను 257 పరుగుల భారీ తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 468 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌ 59.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. బ్రూక్స్‌(50) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్‌వుడ్‌(38), హోల్డర్‌(39), బ్రేవో(23) పరుగులు చేశారు. మహ్మద్‌ షమి, జడేజా మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌ శర్మ రెండు వికెట్లు తీయగా, బుమ్రాకు ఒక వికెట్‌ దక్కింది. సెంచరీ, అర్ధసెంచరీతో సత్తా చాటిన తెలుగు తేజం గాదె హనుమ విహారి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’  అందుకున్నాడు. మొదటి టెస్ట్‌లో 318 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సిరీస్‌ విజయంతో ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో టీమిండియా టాప్‌లో నిలిచింది. 60 పాయింట్లతో న్యూజిలాండ్‌ రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, ఆస్ట్రేలియా.. మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇంగ్లండ్‌ ఐదో స్థానంలో ఉంది. (చదవండి: ధోని రికార్డును దాటేసిన పంత్‌)

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top