ఆటనే కాదు...మనసులూ గెలవండి...

Atal Bihari Vajpayee, a cricket bat and India's historic 2004 tour of Pakistan - Sakshi

సుమారు 15 ఏళ్ల విరామం తర్వాత భారత క్రికెట్‌ జట్టు 2004లో పాకిస్తాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నారు. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా పాక్‌ బయల్దేరడానికి ముందు ప్రధానిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆటనే కాదు. మనసులూ గెలవండి’ అని స్వయంగా హిందీలో రాసిన సందేశంతో కూడిన బ్యాట్‌ను జట్టుకు బహూకరించి బెస్ట్‌ విషెస్‌ చెప్పారు. చారిత్రాత్మక ఈ పర్యటనలో భారత్‌ టెస్టు సిరీస్‌ను 2–1తో, వన్డే సిరీస్‌ను 3–2తో గెలుచుకుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top