రేపటి నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌

Published Sun, Jun 10 2018 10:05 AM

AITA Championship starts tomorrow - Sakshi

హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్‌ రేపటి నుంచి జరుగనుంది. కొంపల్లిలోని జి. బంగారు రాజు కల్చరల్‌ సొసైటీ వేదికగా అండర్‌–16, 18 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు.

ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారుల కోసం శనివారం క్వాలిఫయింగ్‌ టోర్నీని నిర్వహించారు. నేటితో క్వాలిఫయింగ్‌ పోటీలు ముగుస్తాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఐటా టోర్నీకి అర్హత సాధిస్తారు. ఈనెల 15వ తేదీ వరకు ఐటా టోర్నీ జరుగుతుంది.  

Advertisement
Advertisement