ఏలూరు టౌన్: ఏలూరులో ఆదివారం జరిగే బీసీ గర్జన మహాసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించే బీసీ డిక్లరేషన్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రజాసంకల్ప పాదయాత్రలో బీసీ వర్గాల స్థితిగతులను స్వయంగా చూసి తెలుసుకున్నారని, అలాగే బీసీ అధ్యయన కమిటీ గ్రామగ్రామాన తిరిగి వారి సమస్యలు తెలుసుకుని నివేదికను పార్టీ జగన్కు అందజేసిందన్నారు. వీటి ఆధారంగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తారని వెల్లడించారు. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో హేలాపురి సిటీ టౌన్షిప్ పక్కనే నిర్వహిస్తున్న బీసీ గర్జన మహాసభ ఏర్పాట్లను పార్టీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, కొలుసు పార్థసారథి, జంగా కృష్ణమూర్తి, కారుమూరి నాగేశ్వరరావు, మేకా శేషుబాబు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, నర్సయ్య గౌడ్, చల్లపల్లి మోహనరావులతో కలిసి పరిశీలించారు. అనంతరం బొత్స విలేకరులతో మాట్లాడుతూ నాడు వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు బీసీ వర్గాలకు ఎంతో ఉపయోగపడ్డాయని, ఆయన కంటే మిన్నగా జగన్ బీసీల అభివృద్ధికి పాటుపడతారన్నారు.
బీసీలకు టీడీపీ చేసిందేమీ లేదు
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్, చంద్రబాబు బీసీలకు పెద్దగా చేసిందేమీ లేదనీ, వారి ఓట్లతోనే అధికారం చెలాయించటం తప్ప వారి అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. జగన్ను ఆశీర్వదిస్తే బీసీలకు భవిష్యత్తులో మరింత మేలు జరుగుందని హామీ ఇచ్చారు. కొలుసు పార్థసారధి, జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ బీసీల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వైఎస్సార్సీపీ అధ్యయన కమిటీని ఏడాదిన్నర క్రితమే నియమించిందన్నారు. సంచార జాతులకు కూడా మేలు చేసేలా పార్టీ నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి చంద్రబాబు తాయిలాలు వేస్తున్నారన్నారు. బీసీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని 9 జీవోలు జారీ చేశారన్నారు. వాటిలో దేనికైనా విధివిధానాలు, నిధులు కేటాయింపులున్నాయా? అని ప్రశ్నించారు. చంద్రబాబు మాయలను ఈసారి బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఘంటా ప్రసాదరావు, పార్టీ నేతలు గుబ్బల తమ్మయ్య, మరడాని రంగారావు, గుడిదేశి శ్రీనివాసరావు, బొద్దాని శ్రీనివాస్, కర్నాటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ బీసీ డిక్లరేషన్ సువర్ణ అధ్యాయం
Published Sun, Feb 17 2019 5:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement