పవన్‌ కళ్యాణ్‌తో ఉండవల్లి భేటీ | Undavalli Arun Kumar meet Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కళ్యాణ్‌తో ఉండవల్లి భేటీ

Feb 11 2018 7:32 PM | Updated on Mar 22 2019 5:33 PM

Undavalli Arun Kumar meet Pawan Kalyan - Sakshi

ఉండవల్లి అరుణ్‌కుమార్‌, పవన్‌ కళ్యాణ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన నిధులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్ చేశారు. ఆదివారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో తన కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇరు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై ప్రజల మాదిరిగానే తనకు అసంతృప్తి ఉందన్నారు. హోదా విషయంలో వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏపీకి మేలు జరుగుతుందనే టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు.

పవన్‌ను చూడటానికే వచ్చా..
పవన్‌ కళ్యాణ్ సెలబ్రిటీ అని, ఆయనను చూడటానికే వచ్చానని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. పవన్‌ తనతో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. అసలు రాజకీయాలు ఆయన ఇప్పుడు మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడరు, నిజాలు చెప్పరని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement