-
‘అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్’
సాక్షి, విజయవాడ: కోనసీమ ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని.. నిందితులెవరైనా వదిలేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటేనని.. పక్కా ప్లాన్ ప్రకారమే విధ్వంసం సృష్టించారన్నారు. పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్ అలజడి సృష్టించారని దుయ్యబట్టారు. చదవండి: అంబేడ్కర్ పేరుపై అగ్గి రాజేసిన 'కుట్ర'! అంబేడ్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేయలేదా?. అంబేడ్కర్ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ‘‘ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణం. ఇప్పుడు ఈ ఘటనకు కూడా ఆయనే కారణం. ప్రజలన్నా.. వ్యవస్థలన్నా.. చంద్రబాబుకు భయం లేదు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని చంద్రబాబే గొడవలు సృష్టించారన్నారు. నిరసన కారులు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్ హస్తం ఉందని’’ మంత్రి దాడిశెట్టి మండిపడ్డారు. -
పవన్ కళ్యాణ్తో ఉండవల్లి భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇచ్చిన నిధులు, ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆదివారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో తన కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇరు ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై ప్రజల మాదిరిగానే తనకు అసంతృప్తి ఉందన్నారు. హోదా విషయంలో వాస్తవాలు బయటకు తీయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏపీకి మేలు జరుగుతుందనే టీడీపీ, బీజేపీకి మద్దతు ఇచ్చానని తెలిపారు. పవన్ను చూడటానికే వచ్చా.. పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ అని, ఆయనను చూడటానికే వచ్చానని ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. పవన్ తనతో రాజకీయాల గురించి చర్చించలేదన్నారు. అసలు రాజకీయాలు ఆయన ఇప్పుడు మొదలు పెట్టారని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడరు, నిజాలు చెప్పరని వ్యాఖ్యానించారు. -
పవన్ కళ్యాణ్ టీడీపీ ఏజెంట్: హరీష్
హైదరాబాద్: రానున్న ఎన్నికల తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ నాయకుడు హరీష్రావు అన్నారు. 13 ఎంపీ స్థానాలకు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అధికారంలోకి రావాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు. తెలంగాణలో తమకు సంపూర్ణ ఆధిక్యం వస్తుందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేమని అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోలేదన్నారు. కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై వస్తున్న విమర్శలను హరీష్రావు తోసిపుపుచ్చారు. తాము ఉద్యమాలు చేసినప్పుడు ఎందుకు ఈ విషయం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఉద్యమాల్లో తాను పలుమార్లు అరెస్టయ్యానని వెల్లడించారు. హైదరాబాద్లో తాను అరెస్టవని పోలీస్ స్టేషన్ లేదన్నారు. టీడీపీ లబ్ది చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని అరోపించారు. టీడీపీ ఏజెంట్గా ముందుకు వచ్చారని చెప్పారు. జనసేన పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని హరీష్రావు అన్నారు. చిరంజీవిని కూడా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదన్నారు. -
పవన్ ప్రశ్నించే విధానం నచ్చింది: శివాజి
పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంపై తెలుగు సినిమా పరిశ్రమ మౌనం దాల్చింది. ఇప్పటివరకు జనసేనపై సినిమా పెద్దలు స్పందించలేదు. అయితే శివాజి మాత్రం తనదైన శైలిలో స్పందించాడు. పవన్ కళ్యాణ్ విధానాలు తనకు అర్థం కాలేదని ఓ కార్యక్రమంలో అన్నాడు. 'పవన్ కళ్యాణ్ దేనికి కట్టుబడ్డారో నాకు అర్థం కాలేదు. విప్లవవీరుడు చేగువేరా అంటే ఇష్టమని చెప్పుకునే పవర్ స్టార్ ఆశ్చర్యకరంగా బీజేపీకి మద్దతు పలికారు. ఏదైమైనా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే విధానం నాకు నచ్చింది' అని శివాజి వ్యాఖ్యనించినట్టు ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. పాలెం బస్సు ప్రమాద బాధితుల తరపున శివాజి ప్రభుత్వంతో పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అతడికి పలు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. -
మోడీతో పవన్ భేటీ
మోడీకి, బీజేపీకి మద్దతు పలికిన జనసేన నేత సాక్షి, హైదరాబాద్: ఇటీవలే జనసేన పేరుతో పార్టీని ఏర్పాటు చేసిన సినీ నటుడు పవన్కల్యాణ్ శుక్రవారం అహ్మదాబాద్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కలిశారు. పవన్ను మోడీ కార్యాలయానికి తీసుకెళ్లిన బీజేపీ సీమాంధ్ర సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనను మోడీకి పరిచయం చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో బీజేపీకి, మోడీకి పవన్కల్యాణ్ తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన ఏర్పాటు సందర్భంగా ఇటీవల అభిమానులతో నిర్వహించిన సమావేశానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని మోడీ కోరినట్లు సమాచారం. మోడీని కలసిన వారిలో పవన్తో పాటు ఆయన సన్నిహితులు రాజు రవితేజ, రాఘవ, అనిల్ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ప్రతిపాదన... మోడీతో భేటీలో చర్చల సారాంశాన్ని బయటకు వెల్లడించనప్పటికీ.. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న విషయం ఇంకా తేల్చుకోలేదని పవన్కల్యాణ్ చెప్పినట్లు తెలిసింది. అయితే.. పవన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బీజేపీ మద్దతు ఇస్తుందనే ప్రతిపాదనపై వారిమధ్య చర్చ జరిగిందని పవన్ సన్నిహితులు పేర్కొన్నారు. పవన్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని మోడీ తరఫున ప్రతిపాదన వచ్చిందని, ఈ అంశం కొలిక్కి వచ్చినప్పటికీ.. ఇటు బీజేపీ ప్రతినిధులు, అటు పవన్ కల్యాణ్ విషయాన్ని రహస్యంగానే ఉంచినట్లు చెప్తున్నారు. ఇదే జరిగితే.. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పవన్ లోక్సభ బరిలోకి దిగుతారు. అదే సమయంలో బీజేపీ పక్షాన ప్రచారం నిర్వహిస్తారు. పవన్ నిబద్ధత నాకు నచ్చింది: మోడీ ‘‘నేను పవన్ను కలిశాను. ఇది మా తొలి భేటీ. దేశానికి సేవ చేయాలన్న ఆయన ఆకాంక్ష, నిబద్ధత నాకెంతో నచ్చింది...’’ అని మోడీ సామాజిక వెబ్సైట్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. మోడీకి మద్దతు ఇస్తున్నాం: కల్యాణ్ మోడీతో భేటీ అనంతరం పవన్కల్యాణ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి అయ్యే అర్హతలన్నీ మోడీకి ఉన్నాయి. నేను, నా పార్టీ ఆయనకు మద్దతు ఇస్తున్నాం’’ అని ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘‘నేను మోడీకి మద్దతు ఇస్తున్నా.. అంటే నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టే’’ అని బదులిచ్చారు. అయితే.. బీజేపీతో ఆయన పార్టీకి ఎన్నికలకు ముందు పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇవ్వలేదు. భేటీలో వీర్రాజుదే కీలకపాత్ర... తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. సీమాంధ్రలో టీడీపీతో పొత్తును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీతో పొత్తు సంగతి ఎలా ఉన్నా పవన్కల్యాణ్, బీజేపీ కలసిపనిచేయడం వల్ల ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపొచ్చన్న అభిప్రాయంతో ఆయనను స్వయంగా మోడీతో కలిపించడానికి వీర్రాజు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. పార్టీలో కొందరు నేతలు వ్యతిరేకించినప్పటికీ వీర్రాజు తనకున్న పరిచయాలతో పవన్ను మోడీ వద్దకు తీసుకెళ్లారని పార్టీ వర్గాలు చెప్పాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement