చిత్తూరులోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర | PrajaSankalpaYatra Enters Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరులోకి ప్రవేశించిన ప్రజాసంకల్పయాత్ర

Dec 28 2017 9:09 AM | Updated on Jul 25 2018 5:01 PM

PrajaSankalpaYatra Enters Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు : వైఎస్‌ఆర్‌ సీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర గురువారం చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. 46వ రోజు అనంతపురం జిల్లా బలిజపల్లి శివారులో యాత్రను ప్రారంభించిన వైఎస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం ఎద్దులవారి కోట గ్రామంలోకి ప్రవేశించించారు.

పాదయాత్రతో చిత్తూరులోకి ప్రవేశిస్తున్న వైఎస్‌ జగన్‌కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో వైఎస్‌ జగన్‌ 260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఎద్దులవారి కోట నుంచి ఎద్దుల వేమన్నగారి పల్లి, ఆర్‌ఎన్‌ తండా, కొట్టాల క్రాస్‌ మీదుగా వసంతపురం మీదుగా గురువారం యాత్ర కొనసాగనుంది. వసంతాపురంలో ప్రజలతో వైఎస్‌ జగన్‌ మమేకం కానున్నారు. ఇప్పటివరకూ 635.4 కిలోమీటర్ల మేర వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement