కర్నాటకం: అదే ఉత్కంఠ.. | Political High Drama Continues In Karnataka | Sakshi
Sakshi News home page

కర్నాటకం: 4 వారాల సమయం ఇవ్వాలన్న రెబెల్‌ ఎమ్మెల్యేలు

Jul 23 2019 12:09 PM | Updated on Jul 23 2019 1:18 PM

Political High Drama Continues In Karnataka - Sakshi

కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది.

బెంగళూర్‌ : కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు. సిద్ధరామయ్య తమపై సభలో పిటిషన్‌ ఇచ్చిన కాపీలు తమకు ఇంకా అందలేదని స్పీకర్‌కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.

కాగా మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే రెబెల్‌ ఎమ్మెల్యేల వ్యవహరం తేలేవరకూ బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం బలపరీక్ష చేపడతామని స్పీకర్‌ స్పష్టం చేశారు. మరోవైపు రెబెల్‌ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనున్న దృష్ట్యా విశ్వాస పరీక్షపై ఓటిం‍గ్‌ నిర్ణయాన్ని తీర్పు ప్రభావితం చేయనుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement