కేంద్రంపై ఉమ్మడి పోరాటం చేద్దాం

ప్రతిపక్ష పార్టీల నిర్ణయం
న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక మందగమనం, ఆర్సెప్ ఒప్పందం, నిరుద్యోగం, వ్యవసాయ సమస్యలు వంటి వాటిపై ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. సోమవారం ఈ అంశంపై సీనియర్ ప్రతిపక్ష నేతల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఆజాద్, అహ్మద్ పటేల్, సుర్జేవాలా, ఆర్ఎల్ఎస్పీ చీఫ్ ఉపేంద్ర కుష్వాహా, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం నుంచి టీకే రంగరాజన్తోపాటు ఆర్జేడీ, టీఎంసీ, డీఎంకే, ఆర్ఎల్డీ నేతలు హాజరయ్యారు.
ఇది మా విజయమే: కాంగ్రెస్
ఆర్సీఈపీలో చేరబోవడం లేదని భారత్ ప్రకటించడం తమ విజయమేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ వ్యతిరేకించినందువల్లనే ప్రభుత్వం ఆ విషయంలో వెనకడుగు వేసిందని తెలిపింది. ఈ ఒప్పందం కుదిరితే రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయేవారని సూర్జేవాలా అన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి