ఏపీలో హిజ్రాలకు ఇక రూ.1500 పెన్షన్‌ | to day ap cabinet decisions | Sakshi
Sakshi News home page

ఏపీలో హిజ్రాలకు ఇక రూ.1500 పెన్షన్‌

Dec 16 2017 7:32 PM | Updated on Aug 21 2018 6:10 PM

to day ap cabinet decisions - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా తొమ్మిది మండలాలు ఏర్పాటుచేసేందుకు ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే దీని ఆమోదానికి గవర్నర్‌కు పంపించనున్నారు. అలాగే, 2014 పోలీస్‌ యాక్ట్‌ సవరణకు ఆమోదం తెలిపింది. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పలువురు కేబినెట్‌ మంత్రులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా హిజ్రాలకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇళ్ళ స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement