భోపాల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు | Congress shifting its MLAs to Madhya Pradesh | Sakshi
Sakshi News home page

భోపాల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Nov 24 2019 5:19 AM | Updated on Nov 24 2019 5:19 AM

Congress shifting its MLAs to Madhya Pradesh - Sakshi

న్యూఢిల్లీ: ఎన్సీపీలో అజిత్‌ పవార్‌ తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, వారిని మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు తరలిస్తోంది. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను విమానం ద్వారా పంపేందుకు సిద్ధం అయింది. మధ్యప్రదేశ్‌ సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన కమల్‌ నాథ్‌ ఉండడంతో భోపాల్‌ సరైన రక్షణ ప్రాంతమని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ వ్యవహారాలను కమల్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ కూడా పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement