పీసీసీ అధికార ప్రతినిధిగా అర్జున్‌

Banotu Arjun Babu was appointed as TPCC spokesperson. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ అధికార ప్రతినిధిగా బానోతు అర్జున్‌ బాబు నియమితులయ్యారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నాతండాకు చెందిన అర్జున్‌.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా క్రియాశీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top