ఐదో తరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్(ఎఫ్జీఎఫ్ఏ) తుది నమూనా ఖరారు ఒప్పందంపై భారత్, రష్యాలు త్వరలో సంతకం చేయనున్నాయి.
న్యూఢిల్లీ: ఐదో తరం ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్(ఎఫ్జీఎఫ్ఏ) తుది నమూనా ఖరారు ఒప్పందంపై భారత్, రష్యాలు త్వరలో సంతకం చేయనున్నాయి. ఇరు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం వేల కోట్లు వెచ్చించనున్నారు.
ఒప్పందం కోసం అవసరమైన పనులు పూర్తి చేశామని, జూన్ తర్వాత ఒప్పందం కుదరవచ్చని భారత అధికారి తెలిపారు. ఈ ప్రాజెక్టుపై ఇరు దేశాలకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు.