నేడు ముగియనున్న పార్లమెంటు!  | Parliament Sessions Will Be Adjourned On Monday | Sakshi
Sakshi News home page

నేడు ముగియనున్న పార్లమెంటు! 

Mar 23 2020 6:49 AM | Updated on Mar 23 2020 7:03 AM

Parliament Sessions Will Be Adjourned On Monday - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలపై కరోనా వైరస్‌ ప్రభావం పడింది. కరోనా భయంతో చాలారాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌తోపాటు చాలా పార్టీలు సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను కుదించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం ఆర్థిక బిల్లు ఆమోదం తర్వాత సమావేశాలను ముగించే అవకాశముందన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 3 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా, సోమవారమే నిరవధిక వాయిదా పడే అవకాశముంది. దీంతో 12 రోజులు ముందుగానే సమావేశాలు ముగిసినట్లవుతుంది.(కరోనాకు మరో ముగ్గురి బలి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement