దళపతులతో మోదీ భేటీ | Modi held a meeting with Triple Forces heads | Sakshi
Sakshi News home page

దళపతులతో మోదీ భేటీ

Nov 9 2016 2:33 AM | Updated on Aug 21 2018 9:33 PM

ప్రధానిమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు

సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై సమీక్ష
న్యూఢిల్లీ: ప్రధానిమోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితిని సైనిక, నౌకా, వైమానిక దళాల అధిపతులతో సమీక్షించారు. భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్  పాల్గొన్నారు.  జమ్మూకశ్మీర్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దాదాపు రోజూ కాల్పులు జరుపుతున్న  నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.  వాస్తవాధీన రేఖ(ఎల్‌వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి నెలకొన్న పరిస్థితిని, పాకిస్తాన్  కవ్వింపు చర్యలను  ఆర్మీ చీఫ్ జనరల్  దల్బీర్‌సింగ్ ప్రధానికి వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement