పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు | Govt shuts down cross-LoC trade with Pak-occupied Jammu & Kashmir | Sakshi
Sakshi News home page

పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు

Apr 20 2019 4:22 AM | Updated on Apr 21 2019 5:14 AM

Govt shuts down cross-LoC trade with Pak-occupied Jammu & Kashmir - Sakshi

న్యూఢిల్లీ / శ్రీనగర్‌: భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్‌ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యం ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధనసహాయం అందడంతో పాటు నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement