సీఎం ఇంటి చుట్టూ తిరిగిన కరోనా రోగులు

Coronavirus Patients Walking Around CM House Karnataka - Sakshi

కర్ణాటక,యశవంతపుర: కరోనా వైరస్‌ లక్షణాలున్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరులో డాలర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటి చుట్టు పక్కల కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తులు తిరిగినట్లు తెలిసింది. శనివారం కరోనా వైరస్‌ లక్షణాలున్న వ్యక్తుల జాబితా ప్రభుత్వం విడుదల చేశారు. ఇందులో ఎ–59, ఎ–25 నంబర్‌ కలిగిన వ్యక్తులు సీఎం ఇంటి చుట్టూ తిరగటం అందోళన కలిగిస్తోంది. విదేశాల నుండి వచ్చిన పీ–25 రోగి జతతో పాటు వారి ఇంటిలో పాచి పని చేస్తున్న మహిళ (పీ–59)కు వైరస్‌ సోకినట్లు అధికారులు దృవీకరించారు.

సీఎం ఇంటీ చుట్టుపక్కల తిరిగిన రోగులిద్దరు నగరంలోని ఒక ఆస్పత్రిలో ప్రత్యేకంగా చికిత్సలు పొందుతున్నారు. వీటి మధ్య సీఎం నివాసం డాలర్స్‌ కాలనీలో వీరిద్దరూ సంచారించినట్లు తెలుసుకున్న బీబీఎంపీ జాయింట్‌ కమిషనర్‌ పల్లవి, బెంగళూరు ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్‌లు పరిశీలించారు. ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన ఒక మహిళ రోజు డాలర్స్‌ కాలనీలో నాలుగు ఇళ్లల్లో పాచిపని చేస్తుంది.  వీరి ఇళ్ల ముందు గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరిని బయటకు పంపటంలేదని పోలీసులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top