20 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్‌

Coronavirus: 20 Days Baby Tested Positive In Maharashtra - Sakshi

చిన్నారితో పాటు మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌

సాక్షి, ముంబై :  మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాష్ట్రంలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాణ్‌ టౌన్‌కు చెందిన 20 రోజుల శిశువు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. (చదవండి : భారత్‌లో పంజా విసురుతున్న కరోనా)

శిశువుతో పాటు మరో ఆరుగురికి కూడా కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 162కే చేరింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందినట్లు మున్సిపాలిటీ ఆరోగ్య అధికారి డా. రాజు తెలిపారు.మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఇప్పటివరకు 9,915 కరోనా కేసులు నమోదుకాగా, మొత్తం 432 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 33,050కి చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 1074 మంది మృతి చెందారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top